Saturday, November 15, 2025
Homeఆంధ్రప్రదేశ్BAD NEWS: బ్యాడ్ న్యూస్.. వారికి పెన్షన్లు కట్!

BAD NEWS: బ్యాడ్ న్యూస్.. వారికి పెన్షన్లు కట్!

AP Government Said Bad News: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పథకంలో భాగంగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకం కింద దివ్యాంగుల కోటాలో పింఛన్లు పొందుతున్న వారిలో సుమారు 1.08 లక్షల మంది అర్హత లేకుండా బోగస్ సర్టిఫికెట్లు సమర్పించినట్టు ప్రభుత్వం గుర్తించింది. అందుకే ఈ సదరన్‌ ధ్రువీకరణ పత్రాలను రద్దు చేసి, వారికి ఇప్పటికీ వస్తున్న పింఛన్లను నిలిపివేయబోతోంది. ప్రస్తుతం వైద్య బృందాలతో కలిసి గ్రామ, వార్డు సచివాలయాల్లో కొత్తగా వైద్య పరీక్షలు చేపట్టి, నిజంగా అర్హత ఉన్నవారిని గుర్తించేందుకు ప్రయత్నం జరుగుతోంది.

- Advertisement -

ప్రభుత్వ నిబంధనల ప్రకారం, దివ్యాంగుల కోటాలో పింఛన్ అందుకోవాలంటే కనీసం 40 శాతం వైకల్యం ఉండాలి. కొత్తగా చేసే వైద్య తనిఖీల్లో ఈ ప్రమాణానికి తగ్గని వారిని పథకానికి అనర్హులుగా పరిగణించనున్నారు. వారికి పింఛన్లను నిలిపివేస్తారు. ఇక నిజంగా అర్హులైనవారికి మాత్రం తాజా వైద్య పరీక్షల ఆధారంగా కొత్త సదరన్ సర్టిఫికెట్లు ఉచితంగా జారీ చేయనున్నారు. ఈ సర్టిఫికెట్లు ఈ నెల 25వ తేదీ నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో లభించనున్నాయి. ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు పాత ధ్రువీకరణ పత్రాలు చెల్లవు.

ALSO READ: https://teluguprabha.net/andhra-pradesh-news/trails-in-acb-court-on-mithun-reddy-pitions-are-over-here-is-the-judgement/

ఇదిలా ఉంటే, రాష్ట్రంలోని పది పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలనను ప్రభుత్వం మరో ఆరు నెలలు పొడిగించింది. ఇప్పటికే కొన్నిచోట్ల ప్రత్యేక అధికారుల పదవీకాలం ముగియగా, ఎన్నికలు జరగే వరకు వారు విధుల్లో కొనసాగనున్నారు. ఈ మేరకు పురపాలక శాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది.

ALSO READ: https://teluguprabha.net/andhra-pradesh-news/ap-government-organized-a-commitee-for-districts-name-change/

ఈ రెండు నిర్ణయాలూ ప్రజాస్వామ్య పరంగా, నిధుల వినియోగంలో పారదర్శకత కోసం తీసుకున్నవి. ఒకవైపు పింఛన్ పథకాన్ని అర్హులకే పరిమితం చేయడం ద్వారా వనరులను సరిగ్గా వినియోగించేందుకు చర్యలు తీసుకుంటుండగా, మరోవైపు ఎన్నికలు జరగే వరకు పట్టణ ప్రాంతాల్లో పరిపాలన నిరవధికంగా కొనసాగించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రజల ఆరోగ్యం, ఆర్థిక భద్రత కోసం ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు సకాలంలో సరైన మార్గదర్శకంగా నిలుస్తాయని అధికారులు ఆశిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad