Maha Shivratri: మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఫిబ్రవరి 16(సోమవారం) ఆప్షనల్ హాలీడేగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్ ఇచ్చింది.
మహా శివరాత్రి ఈ ఏడాది ఫిబ్రవరి 15 ఆదివారం వచ్చిన విషయం తెలిసిందే. రేపు శివరాత్రి జాగారంలో భక్తులు ఉండటంతో మరుసటి రోజు ఆప్షనల్ హాలీడేగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సర్కారు తీపి కబురు అందించింది. ఈ మేరకు ఈ నెల 16న ఆప్షనల్ హాలీడేగా పరిగణించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే విజయానంద్ అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేశారు. మహాశివరాత్రి జాగారం అనంతరం ఉద్యోగులు విశ్రాంతి తీసుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
Also Read: https://teluguprabha.net/telangana/congress-strategy-meet-on-telangana-hung-municipalities/
ఆప్షనల్ హాలీడే పట్ల ఏపీ జేఏసీ అమరావతి నేతలు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో పండుగను ప్రశాంతంగా జరుపుకొనేందుకు ఉద్యోగులకు అవకాశం దొరుకుతుందని వెల్లడించారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలిపారు.

