AP Inter supplementary results tomorrow: ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్. ఫస్ట్, సెకండియర్ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలకు రంగం సిద్ధమైంది. గురువారం (జూన్ 18)న మధ్యాహ్నం 12 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. మే 21 నుంచి జూన్ 4వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగ్గా.. దాదాపు 12.5 లక్షల జవాబుపత్రాల మూల్యాంకన ప్రక్రియను పూర్తి చేసి ఫలితాల విడుదలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సప్లిమెంటరీ ఫలితాల కోసం వేచి చూస్తున్న విద్యార్థులు తమ ఫలితాలను www.bie.ap.gov.in వెబ్సైట్ల ద్వారా చెక్ చేసుకోవచ్చు.
Also Read: Rahul Gandhi: టెలిగ్రామ్ మాదిరిగా వాట్సాప్నూ బ్యాన్ చేస్తారేమో..! కేంద్ర తీరుపై రాహుల్ ఫైర్

