Sunday, July 7, 2024
Homeఆంధ్రప్రదేశ్AP: జగన్ ను కలిసిన రాష్ట్రీయ ఓబీసీ మహాసంఘ్

AP: జగన్ ను కలిసిన రాష్ట్రీయ ఓబీసీ మహాసంఘ్

ఆగష్టు 7న తిరుపతి ఎస్‌వీ స్టేడియంలో నేషనల్‌ మెగా కన్వెన్షన్‌ సెంటర్ లో మహాసంఘ్ భేటీ

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిసి రాష్ట్రీయ ఓబీసీ మహాసంఘ్‌ 8 వ జాతీయ మెగా కన్వెన్షన్‌కు ఆహ్వానించారు మహాసంఘ్‌ ప్రతినిధుల బృందం. ఆగష్టు 7న తిరుపతి ఎస్‌వీ స్టేడియంలో నేషనల్‌ మెగా కన్వెన్షన్‌ సెంటర్ లో మహాసంఘ్ భేటీ ఉండనుంది. 2016 నుంచి ప్రతి ఏటా దేశంలోని వివిధ ప్రాంతాల్లో కన్వెన్షన్‌లు రాష్ట్రీయ ఓబీసీ మహాసంఘ్‌ నిర్వహించింది. జాతీయ, రాష్ట్ర స్ధాయిలో ఓబీసీలకు సంబంధించిన అనేక కీలక డిమాండ్‌లు, పరిష్కారంపై మెగా కన్వెన్షన్‌లో చర్చించనున్నారు ఓబీసీ నేతలు.

- Advertisement -

ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వనించిన ఆల్‌ ఇండియా బ్యాక్‌వర్డ్‌ క్లాస్‌ ఫెడరేషన్‌ ప్రెసిడెంట్‌ జస్టిస్‌ వి.ఈశ్వరయ్య, రాష్ట్రీయ ఓబీసీ మహాసంఘ్‌ జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ బాబారావు తైవాడే, జనరల్‌ సెక్రటరీ సచిన్‌ రాజుర్కర్, వైస్‌ ప్రెసిడెంట్స్‌ జాజుల శ్రీనివాస్‌ గౌడ్, కేశన శంకరరావు. హాజరైన గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News