Andhra Pradesh: ఏపీలో పెరుగుతున్న నిత్యావసర ధరలను అదుపులోకితీసుకుని వచ్చేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు మొదలు పెట్టింది.అందులో భాగంగా వినియోగదారులకు నాణ్యమైన బియ్యాన్ని తక్కువ ధరకే అందిస్తున్నట్లు ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు.
రూ. 52 కే సన్నబియ్యం..
రూ. 52 కే సన్నబియ్యం అందించే కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. ఆటోనగర్లోని ఏపీఐఐసీ రైతు బజార్లో సబ్సిడీ బియ్యం విక్రయాలను మంత్రి నాదెండ్ల ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 150 రైతు బజార్లు, 500 రైస్ మిల్లింగ్ అవుట్లెట్ల ద్వారా ఈ సబ్సిడీ బియ్యం విక్రయాలు ఆదివారం నుంచే అందుబాటులోకి వచ్చాయని ఆయన పేర్కొన్నారు.
బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలు కిలోకు దాదాపు రూ. 10 వరకు పెరగడంతో ప్రజలపై పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని అమలులోకి తీసుకుని వచ్చింది.
దేశంలోనే అత్యంత తక్కువ ధరకు అత్యుత్తమ నాణ్యత కలిగిన బియ్యాన్ని అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం ప్రారంభమైంది. బియ్యంతో పాటు కందిపప్పు, పామాయిల్ వంటి నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణపై కూడా పౌర సరఫరాల శాఖ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు మంత్రి నాదెండ్ల వివరించారు.
Also Read:Holidays: విద్యార్థులకు అదిరిపోయే న్యూస్..ఆగస్టులో సెలవులే..సెలవులు

