Saturday, November 15, 2025
HomeTop StoriesAmaravati News: ప్రమాదకరంగా ‘బ్లూ బ్యాచ్’.. ఫేక్‌ పోస్టులపై మంత్రి లోకేష్ ఆగ్రహం.. ట్వీట్‌ వైరల్‌

Amaravati News: ప్రమాదకరంగా ‘బ్లూ బ్యాచ్’.. ఫేక్‌ పోస్టులపై మంత్రి లోకేష్ ఆగ్రహం.. ట్వీట్‌ వైరల్‌

AP Minister Nara Lokesh Tweet on Blue Batch Fake Posts: సోషల్‌ మీడియాలో అసలు వార్తల కంటే నకిలీ వార్తలే ఎక్కువగా సర్క్యులేట్‌ అవుతున్నాయి. ఫేక్‌ వార్తలు ప్రచారం చేసే వారిపై ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపుతున్నా, కొందరు మాత్రం అదేపనిగా తప్పుడు వార్తలు రాస్తున్నారు. ఇలాంటి వారిపై ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ సీరియస్ అయ్యారు. సమాజానికి హానికరంగా మారిన వైసీపీ సోషల్‌మీడియా ‘బ్లూ బ్యాచ్‌’పై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి ప్రభుత్వంపై విమర్శల చేస్తూ తప్పుడు రాతలు, వీడియోలు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అంతేకాదు, కులాల మధ్య గొడవలు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వారిని కూటమి సర్కార్ పదేపదే హెచ్చరిస్తున్నా ఏ మాత్రం వినడం లేదు. ఈ నేపథ్యంలో ఎక్స్ వేదికగా మంత్రి లోకేష్ పోస్టు పెట్టారు. తప్పుడు ప్రచారం ఆధారంగా రాజకీయం చేద్దామనుకుంటున్న ‘బ్లూ బ్యాచ్’ సమాజానికి ప్రమాదకరంగా మారిందనడంలో సందేహం లేదన్నారు. రాష్ట్రంలోని ఓ గురుకుల పాఠశాలలో 2023 నాటి పరిస్థితికి సంబంధించిన వీడియోను తాజాగా అరకు‌లో జరిగినట్లు వైసీపీ అనుబంధ సోషల్ మీడియా ఒక కథనం రాసిందని, దీనిపై విస్తృతంగా ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.

- Advertisement -

లోకేష్‌ ట్వీట్‌తో రంగంలోకి పోలీసులు..

ఈ ఫేక్‌ ప్రచారంపై ప్రభుత్వం ‘ఫ్యాక్ట్ చెక్’ నిపుణులతో వివరాలు సేకరించింది. ఇలాంటి తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. దీంతో కూటమి ప్రభుత్వం కొద్దిరోజులు సైలెంట్ అయ్యింది. మళ్లీ అదే వీడియోతో తాజాగా తప్పుడు ప్రచారం మొదలుపెట్టేసింది. ఈ వ్యవహారం నేరుగా మంత్రి లోకేష్ దృష్టికి వెళ్లింది. ఇలాంటి నేరాలకు పాల్పడేవారిని ‘హ్యాబిట్యువల్ అఫెండర్స్’ (నేరాలు చేయడానికి అలవాటు పడ్డవారు) అంటారు. అది ఒక రాజకీయ పార్టీనా హ్యాబిట్యువల్ అఫెండర్స్ ముఠానా? అనే అనుమానం వస్తుందన్నారు. ఈ ఫేక్ ప్రచారాన్ని ప్రజలు ఎవరూ నమ్మవద్దని, అలాంటి ప్రచారాలు చేసేవారిపై చర్యలు తీసుకోవలసిందిగా @APPOLICE100 వారిని కోరారు. ఆ పోస్టును ఏపీ పోలీసులకు ట్యాగ్ చేశారు. మంత్రి ట్వీట్‌తో పోలీసులు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఈ ఫేక్‌ పోస్టులు ఎక్కడ నుంచి అప్‌లోడ్ అవుతున్నాయి? అనే విషయంపై కూపీ లాగుతున్నారు. దీనికి సంబంధించి రేపో మాపో అరెస్టులు ఖాయమని అంటున్నారు. ఈ మధ్యకాలంలో చాలా రాజకీయ పార్టీలు విదేశాల నుంచి పోస్టింగులు పెడుతున్నారు. మరి వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి మరి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad