Sunday, November 16, 2025
Homeఆంధ్రప్రదేశ్AP rains alert: బుధవారం నుంచి వర్షాలు

AP rains alert: బుధవారం నుంచి వర్షాలు

ఆగ్నేయ బంగాళాఖాతం మరియు దానికి ఆనుకుని ఉన్న హిందూ మహాసముద్రంలో కేంద్రీకృతమైన అల్పపీడనం బలపడిందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదిలి రేపు (నవంబర్ 25న) దక్షిణ బంగాళాఖాతం మధ్య భాగాలపై వాయుగుండంగా మారే అవకాశం ఉందని వెల్లడించారు. ఆతర్వాత మరో 2 రోజుల్లో వాయువ్య దిశగా తమిళనాడు-శ్రీలంక తీరాల వైపు వెళ్లే అవకాశం ఉందన్నారు.

- Advertisement -

దీని ప్రభావంతో బుధవారం నుంచి శనివారం (27-30నవంబర్) వరకు కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.

వర్షాల నేపథ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రైతులు పంట పొలాల్లో నిలిచిన అదనపు నీటిని బయటకు పోయేలా ఏర్పాట్లు చేసుకోవాలి. పండించిన ధాన్యాన్ని సురక్షిత ప్రదేశాలలో ఉంచాలని, ఉద్యానవన పంట మొక్కలు/చెట్లు పడిపోకుండా నిలబడేందుకు కర్రలు/బాదులతో సపోర్ట్ అందించాలని కోరారు.ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad