Thursday, April 10, 2025
Homeఆంధ్రప్రదేశ్AP stampede: చంద్రబాబు సభలో తొక్కిసలాట, ఎనిమిది మంది మృతి

AP stampede: చంద్రబాబు సభలో తొక్కిసలాట, ఎనిమిది మంది మృతి

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి సభలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ఎనిమిది మంది మృతి చెందారు. కందుకూరులో జరిగిన సభలో జరిగిన తొక్కిసలాటలో మురుగు కాలువలో పడిన వారి సంఖ్య ఎనిమిది మందికి చేరింది. మరో ఇద్దరికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. పామూరులోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద చంద్రబాబు రోడ్ షో జరిగింది. రోడ్ షో సందర్భంగా బాబు ప్రసంగిస్తుండగా తొక్కిసలాట జరిగింది. దీంతో చంద్రబాబు రోడ్ షో అంతా ఆర్తనాదాలతో నిండిపోయింది. ఈ ఘటన తనను కలిచివేసిందని, బాధితులను పరామర్శించిన చంద్రబాబు అన్నారు. పార్టీ తరపున మృతుల కుటుంబాలకు 10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు చంద్రబాబు. బాధిత కుటుంబాలకు అన్నివిధాల అండగా ఉంటామని బాబు హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News