Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Athmakuru: టీడీపీలోకి 100 కుటుంబాలు

Athmakuru: టీడీపీలోకి 100 కుటుంబాలు

బుడ్డా ఆధ్వర్యంలో..

ఆత్మకూరు మండలం సిద్దాపురం గ్రామంలో సర్పంచు వెంకటరమణ ఆధ్వర్యంలో టి.డి.పి.మాజీ ఎమ్.ఎల్ ఏ .బుడ్డా రాజశేఖర్ రెడ్డి సమక్షంలో టి.డి.పిలోకి 100 కుటుంబాలు చేరడం జరాయి. ముందుగా పార్టీ శ్రేణులను కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం బుడ్డా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ సిద్దాపురం రైతులు ఈరోజు పంటలు వేసుకొని సంతోషంగా ఉన్నారంటే అది టి.డి.పి.ప్రభుత్వమే అని అన్నారు. చంద్రబాబు నాయుడు దృష్టిలో సిద్దాపురం గ్రామం వుందని గ్రామానికి కావాల్సిన పనులు అన్ని ప్రభుత్వం వచ్చాక చేస్తామని అందరూ కలసి కట్టుగా పార్టీ కోసం పని చేయాలని సిద్దాపురం గ్రామం రాష్ట్ర స్థాయిలో పేరు వచ్చేలా చేస్తామని అన్నారు. గత ప్రభుత్వ నాయకులు మాయమాటలు చెప్పి సిద్దాపురం గ్రామానికి ఏమి చేయలేదని అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News