Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్Athmakuru: శిల్పా ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ

Athmakuru: శిల్పా ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ

వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చి నాలుగేళ్లు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా ఆత్మకూరు పట్టణంలో ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. పట్టణ, మండల నాయకులు కార్యకర్తలు ఎండను సైతం లెక్కచేయకుండా తమ నాయకుడి పట్ల అభిమానాన్ని చాటుతూ ఈ ర్యాలీలో పాల్గొని ఆత్మకూరు పట్టణ పురవీధుల్లో జై జగన్ జై శిల్పా నినాదాలతో హోరెత్తించారు. ముందుగా ఆత్మకూరు పట్టణ పార్టీ ఆఫీస్ నుంచి బయలుదేరి గౌడ్ సెంటర్ మీదుగా నంద్యాల టర్నింగ్ దగ్గర గల వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అర్పించారు. అనంతరం కొత్తపేట, అమ్మవారి శాల,పాత మున్సిపల్ ఆఫీస్ మీదుగా తోటగిరి, పాత బస్టాండ్,ఎమ్మార్వో ఆఫీస్ రోడ్ బస్టాండ్ మీదుగా తిరిగి ర్యాలీ పార్టీ ఆఫీస్ కు చేరుకుంది. ఈ కార్యక్రమంలో శ్రీశైలం నియోజకవర్గం సమన్వయకర్త శిల్పా భువనేశ్వర్ రెడ్డి ఆత్మకూరు పట్టణ మండల వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News