ఏపీ అసెంబ్లీ(AP Assembly) రేపటికి వాయిదా పడిన సంగతి తెలిసిందే. సభ వాయిదా అనంతరం అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన బీఏసీ సమావేశం(BAC Meeting )ప్రారంభమైంది. ఈ సమావేశంలో టీడీపీ నుంచి సీఎం చంద్రబాబు, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, ప్రభుత్వ విప్ జీవీ ఆంజనేయులు, జనసేన నుంచి మంత్రి నాదెండ్ల మనోహర్, బీజేపీ నుంచి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు హాజరయ్యారు. ఈ సమావేశంలో వచ్చే నెల 21వ తేదీ వరకు బడ్జెట్ సమావేశాలు నిర్వహించేందుకు నిర్ణయించారు. అవసరమైతే మరో రెండు రోజుల సభ నిర్వహించే వెసులుబాటు కల్పించారు.


