Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Banaganapalli: జొన్నల పంపిణీ కార్యక్రమం ప్రారంభం

Banaganapalli: జొన్నల పంపిణీ కార్యక్రమం ప్రారంభం

బనగానపల్లె మండలంలో రాష్ట్ర ప్రభుత్వం ఎండియుల ద్వారా అందిస్తున్న ఉచిత జొన్నల పంపిణీ మీరాపురం గ్రామంలో యాగంటి ఆలయ చైర్మన్ తోట బుచ్చిరెడ్డి ప్రారంభించారు. ఈసందర్భంగా యాగంటి ఆలయ చైర్మన్ తోట బుచ్చిరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పేద ప్రజల ఆకలి తీర్చడానికి ఎండియుల ద్వారా వారి ఇంటి వద్ద రేషన్ సరుకులను అందిస్తామన్నారు. ఇందులో భాగంగా మే నెల నుండి ఉచిత బియ్యంతో పాటు ఒక కేజీ నాణ్యమైన జొన్నలను పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News