Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Bandar port works: మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులు ప్రారంభం

Bandar port works: మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులు ప్రారంభం

ఇక కృష్ణా జిల్లా ముఖచిత్రం పూర్తిగా మారిపోవటం ఖాయం. బందరు పోర్టు నిర్మాణంతో కృష్ణా జిల్లా ముఖచిత్రం మారిపోనుంది. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రూ.5,156 కోట్ల వ్యయంతో చేపట్టనున్న మచిలీపట్నం పోర్టు నిర్మాణపనులను కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం మంగినపూడిలో ప్రారంభించారు సీఎం వైయస్‌. జగన్‌. భూసేకరణ చేసి, అన్ని అనుమతులు సాధించి, న్యాయ వివాదాలు పరిష్కరించి, టెండర్లు ఫైనలైజ్‌ చేసి, ఫైనాన్షియల్‌ క్లోజర్‌ పూర్తి చేసి ఈ రోజు పోర్టు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులు ప్రారంభం, వాణిజ్య కార్యకలాపాల విస్తరణకు శుభారంభం చేశారు.

- Advertisement -

స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ళలో కేవలం 6 పోర్టులు కడితే, ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో నవశకానికి నాంది పలుకుతూ అధికారంలోకి వచ్చిన కేవలం 4 ఏళ్ళలోపే 4 పోర్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం, ఇప్పటికే రామాయపట్నంలో శరవేగంగా జరుగుతున్న పనులు, మూలపేట పోర్టు పనులు కూడా ఇప్పటికే ప్రారంభం, చురుగ్గా సాగుతున్న కాకినాడ గేట్‌ వే పోర్టు పనులు, మరి నేడు బందరు ప్రజల చిరకాల వాంఛను నెరవేరుస్తూ మచిలీపట్నం పోర్టు నిర్మిస్తున్నారు.

35.12 మిలియన్‌ టన్నుల వార్షిక సామర్ధ్యంతో 2 జనరల్‌ కార్గోకు, ఒకటి బొగ్గుకు, మరొకటి మల్టీపర్పస్‌–కంటైనర్‌తో ఎగుమతి, దిగుమతులకు వినియోగపడేలా మొత్తం 4 బెర్తులతో మచిలీపట్నం పోర్టు నిర్మాణం, 24–30 నెలల్లో పోర్టు పనులు పూర్తి, ప్రత్యక్షంగా, పరోక్షంగా 25 వేల మందికి ఉపాధి, పెరగనున్న వాణిజ్య కార్యకలాపాలు, ట్రాఫిక్‌కు అనుగుణంగా 16 బెర్తులతో 116 మిలియన్‌ టన్నుల వార్షిక సామర్ధ్యం వరకు పోర్టు విస్తరణ.

రాష్ట్రంలోని గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు తెలంగాణలోని ఖమ్మం, కరీంనగర్, అదిలాబాద్, నల్గొండ, వరంగల్‌ జిల్లాలకు ఎరువులు, బొగ్గు, వంట నూనె, కంటైనర్ల దిగుమతులు, వ్యవసాయ ఉత్పత్తులు, సిమెంట్, సిమెంట్‌ క్లింకర్, గ్రానైట్, ముడి ఇనుము ఎగుమతులకు వేదికగా మారనున్న మచిలీపట్నం పోర్టు. సుమారు రూ. 16,000 కోట్ల వ్యయంతో రామాయపట్నం, మచిలీపట్నం, కాకినాడ గేట్‌వే, మూలపేట పోర్టుల నిర్మాణం, ప్రత్యక్షంగా, పరోక్షంగా 75 వేల మందికి ఉపాధి లభించనుంది.

మచిలీపట్నం పోర్టు నేపధ్యం

తూర్పుతీరంలో ఆంగ్లేయులతో పాటు డచ్, పోర్చుగీస్‌ వారికి సైతం వ్యాపార కేంద్రంగా విలసిల్లింది మచిలీపట్నం. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే పోర్టు నిర్మాణానికి 4 ఫిబ్రవరి 2020న మచిలీపట్నం పోర్టు డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ పేరుతో ప్రత్యేక సంస్ధ ఏర్పాటు, రూ. 5,156 కోట్లతో పోర్టు నిర్మాణానికి పరిపాలన అనుమతుల మంజూరు.

28 ఫిబ్రవరి 2023న పోర్టు నిర్మాణానికి కీలకమైన పర్యావరణ అనుమతులు, 13 ఏప్రిల్‌ 2023న కాలుష్య నియంత్రణ మండలి అనుమతులు మంజూరు, 2023 మార్చి నెలలో 1,923 ఎకరాల భూసేకరణ పూర్తి, 22 మే 2023న పోర్టు నిర్మాణ పనుల ప్రారంభం.

మచిలీపట్నం పోర్టు విశేషాలు

భూసేకరణ, ఇతర అనుబంధ పోర్టులతో కలిపి మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ. 5,155.73 కోట్లు
వార్షిక సామర్ధ్యం – 35.12 మిలియన్‌ టన్నులు
బెర్తుల సంఖ్య – 4
భూ సేకరణ – 1,923 ఎకరాలు
ఎన్‌హెచ్‌ 216 ను అనుసంధానం చేస్తూ 6.5 కిలోమీటర్లు నాలుగు లేన్ల రహదారి
పెడన రైల్వే స్టేషన్‌ నుంచి పోర్టు వరకు 7.5 కి.మీ రైల్వే లైన్‌ నిర్మాణం
బందరు కెనాల్‌ నుండి 11 కి.మీ పైప్‌లైన్‌ ద్వారా 0.5 ఎంఎల్‌డీ(మిలియన్‌ లీటర్స్‌ పర్‌ డే) నీటి సరఫరా
పెడన 220 కేవీ సబ్‌స్టేషన్‌ నుండి 15 ఎంవీఏ(మెగా వోల్డ్‌ యాంప్‌) విద్యుత్‌ సరఫరా

మారనున్న సముద్ర తీర ప్రాంత ముఖచిత్రం

పటిష్టమైన మారిటైమ్‌ మౌలిక సదుపాయాలు, 974 కి.మీ తీరంతో దేశంలోనే రెండవ అతిపెద్ద సముద్ర తీరం గల రాష్ట్రం, ఇప్పటికే ఉన్న 6 పోర్టులు, కొత్తగా నిర్మిస్తున్న 4 పోర్టులతో ఆగ్నేయాసియాకు ముఖ ద్వారంగా ఆంధ్రప్రదేశ్‌.

ఇప్పటికే ఉన్న విశాఖపట్నం మేజర్‌ పోర్టు, 5 నాన్‌ మేజర్‌ పోర్టుల ద్వారా ఏటా 320 మిలియన్‌ టన్నుల వార్షిక సామర్ధ్యంతో కార్గో రవాణా, కొత్తగా నిర్మిస్తున్న పోర్టుల ద్వారా 2025–26 నాటికి అదనంగా మరో 110 మిలియన్‌ టన్నుల రవాణా సామర్ధ్యం అందుబాటులోకి

పారిశ్రామికాభివృద్ది, వాణిజ్య కార్యకలాపాలకు ఊతమిచ్చేలా కొత్తగా నిర్మిస్తున్న మచిలీపట్నం పోర్టు సమీపంలో పోర్టు ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు 4,000 ఎకరాల సాల్ట్‌ భూముల గుర్తింపు

తీర ప్రాంతం మరియు పోర్టు పరిసర ప్రాంతాల పారిశ్రామికీకరణ దిశగా అడుగులు, పోర్టు అనుసంధానిత లాజిస్టిక్స్‌ ఏర్పాటు ద్వారా రైతులు వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేసుకునే సౌలభ్యం

మత్స్యకారులకు లబ్ధి చేకూర్చే విధంగా ప్రపంచస్ధాయి మౌలిక సదుపాయాలతో 10 ఫిషింగ్‌ హార్బర్లు, 6 ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్ల నిర్మాణం, ప్రతి 50 కి.మీ పొడవునా, ఒక పోర్టు లేదా ఒక ఫిషింగ్‌ హార్బర్‌ దిశగా అడుగులు

2035 నాటికి రాష్ట్రంలో 20 బిలియన్‌ డాలర్లకు చేరనున్న బ్లూ ఎకానమీ

దేశంలోని అతిపెద్ద పోర్టుల్లో ఒకటిగా, రాష్ట్ర ఆర్ధికాభివృద్దిలో కీలకంగా మారనున్న మచిలీపట్నం పోర్టు.

రాష్ట్రానికి ప్రకృతి ప్రసాదించిన అతి పెద్ద సముద్ర తీర ప్రాంతాన్ని అభివృద్ది చేసేందుకు సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్తున్న వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News