Wednesday, April 16, 2025
Homeఆంధ్రప్రదేశ్Bandiathmakuru: 'గడప గడప'కులో గంపెడు వరాలు

Bandiathmakuru: ‘గడప గడప’కులో గంపెడు వరాలు

బండిఆత్మకూరు మండలంలోని సోమయాజులపల్లి గ్రామంలో శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఏ ప్రభుత్వం చేయలేని విధంగా అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత జగన్ కే దక్కుతుందని, జగనన్న అందించిన సంక్షేమ పథకాలే మళ్లీ ఆయనను గెలిపిస్తాయని, మళ్ళీ వచ్చేది జగనన్న ప్రభుత్వమే ఎమ్మెల్యే అన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ప్రతి ఒక్కరూ జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నట్లు ఎమ్మెల్యే పేర్కొరంటూ . ఇల్లు అడిగినవారికి ఇల్లు ,ఇంటిస్థలం అడిగినవారికి ఇంటిస్థలం ,పింఛన్ అడిగినవారికి పింఛన్ ఇట్లా అడిగినవారికి అడిగినట్లు గడప గడపలో గంపెడు వరాలు కురిపించి సాయంత్రం నాలుగుగంటల నుండి రాత్రి 9 గంటల వరకు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కొనసాగించారు .

- Advertisement -

ఈ కార్యక్రమంలో శ్రీశైలం నియోజకవర్గం సమన్వయకర్త శిల్పా భువనేశ్వరరెడ్డి ,ఎంపిపి దేరెడ్డి చిన్నసంజీవరెడ్డి ,జేసీఎస్ కన్వినర్ ముడిమెల పుల్లారెడ్డి ,ఎంపిటిసి రామయ్య ,సర్పంచి లక్కబోయిన లావణ్య ,మాజీ ఎంపిపి దేసు వెంకటరామిరెడ్డి ,ఎంపీడీఓ వాసుదేవగుప్తా ,ఉప తహసీల్ధారు హరిత ,ఎసై టి.బాబు ,ఏపీఓ వసుధ ,ఎపిఎం రాజశేఖరరెడ్డి ,విద్యుత్ శాఖ ఏ ఈ ప్రసాదరెడ్డి ,పంచాయితీ కార్యదర్శిసుజాత ,భొజనం సర్పంచి బారెడ్డి భాస్కరరెడ్డి ,పరమటూరు సర్పంచిజగన్మోహన్ రెడ్డి ,కాకనూరు సర్పంచి మహేశ్వరరెడ్డి ,ఎంఏఓ స్వాతి ,కాకనూరు వెంకటసుబ్బయ్య ,ఎర్రగుంట్ల పుల్లయ్య ,హోసింగ్ ఏ ఈ సుంకిరెడ్డి , సింగిల్విండో ప్రసిడెంట్ భూరం శివలింగం ,గ్రామ వాలంటరీలు ,సచివాలయ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు ,వివిధ గ్రామాల వైసీపీ కార్యకర్తలు ,ప్రజలు పాల్గొన్నారు .

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News