Monday, July 8, 2024
Homeఆంధ్రప్రదేశ్Bethamcharla: బుగ్గన సమక్షంలో వైసీపీలోకి 10 కుటుంబాలు

Bethamcharla: బుగ్గన సమక్షంలో వైసీపీలోకి 10 కుటుంబాలు

రాబోయేది వైసీపీ సర్కారే కాబట్టి పార్టీలో చేరాం

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టి నాయకులు (సిమెంట్ నగర్) యాకోబ్ ఆధ్వర్యంలో ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి సమక్షంలో సిమెంట్ నగర్ గ్రామానికి చెందిన 10 కుటుంబాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి, పేద, బడుగు, బలహీనవర్గాల ప్రజల కోసం నిరంతరం సేవ చేస్తున్నాడని వారంతా ముక్తకంఠంతో పేర్కొన్నారు. ప్రజాసేవే పరమావధిగా వైసీపీ ప్రభుత్వ విధానాలు బాగున్నాయని, మన ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి డోన్ నియోజక వర్గాన్ని గతంలో ఏ మంత్రులు, ఎంఎల్ఏలు చేయలేని అభివృద్ధిని ఇప్పుడు చేసి చూపిస్తున్నారని, రాబోయేది మళ్లీ వైసీపీ ప్రభుత్వమే అని తామంతా వైసీపీలో చేరుతున్నామని వారు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News