Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Bethamcharla: స్వేచ్చగా ఓటు వేయండి

Bethamcharla: స్వేచ్చగా ఓటు వేయండి

ఫుట్ పెట్రోలింగ్

బేతంచెర్ల మండలంలోని హెచ్ కొట్టాల, గొరుమానుకొండ గ్రామాలలో బేతంచెర్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి. ప్రియతం రెడ్డి, ఎస్ఐ శివ శంకర్ నాయక్ ఆధ్వర్యంలో 48 మంది సిఎపిఎఫ్ జవాన్లు బేతంచెర్ల పోలీస్ సిబ్బందితో కలిసి ఫుట్ పెట్రోలింగ్ చేశారు. ఆయా గ్రామాల్లోని ప్రజలతో సీఐ ప్రియతం రెడ్డి మాట్లాడుతూ రాబోవు సార్వత్రిక ఎన్నికలలో ఓటు హక్కు పొందినవారు, ఓటును స్వేచ్ఛగా ఉపయోగించుకోవాలని తెలిపారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరుగకుండా శాంతియుత వాతావరణంలో ఎలక్షన్లు జరిగే విధంగా ప్రజలు ఓటును వినియోగించుకోవాలన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News