Sunday, July 7, 2024
Homeఆంధ్రప్రదేశ్Bethamcharla: బేతంచర్లలో 'గడప గడప'కు

Bethamcharla: బేతంచర్లలో ‘గడప గడప’కు

సచివాలయ సేవలు వినియోగించుకోండి

గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా బేతంచెర్ల పట్టణంలోగల, దుర్గాపేట కాలనీలో జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బేతంచెర్ల ఎంపీపీ నాగభూషణం రెడ్డి బేతంచెర్ల నగరపంచాయితీ చైర్మన్ సిహెచ్. చలంరెడ్డి, వైసీపీ సీనియర్ నాయకులు బాబుల్ రెడ్డి, ముర్తు జావలి, గూని నాగరాజులు హాజరయ్యారు. ఎంపీపీ బుగ్గన నాగభూషణం రెడ్డి బేతంచెర్ల నగర పంచాయితీ చైర్మన్ సి.హెచ్ చలంరెడ్డిలు మాట్లాడుతూ జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా సచివాలయంలోనే పదకొండు రకాల సర్టిఫికెట్లు ప్రజలకు ఇస్తున్నట్టు, అవసరమైన వారు సచివాలయ సేవలను వినియోగించుకోవాలన్నారు. సంక్షేమ పథకాలు అందనివారుంటే తెలియజేయాలని ప్రజలను కోరారు. ఏదైనా సమస్యలుంటే అధికారులతో మాట్లాడి తగున్యాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు.

- Advertisement -

రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తూ, ప్రజల గుమ్మం దగ్గరకే సంక్షేమ ఫలాలు అందిస్తున్న మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని రాబోయే ఎన్నికలలో మళ్లీ ముఖ్యమంత్రిని చేసేందుకు, వైస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటుకు ప్రజలు సంసిద్ధులు కావాలని ఎంపీపీ బుగ్గన నాగభూషణం, చైర్మన్ చలంరెడ్డి కోరారు. డోన్ నియోజక అభవృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న రాష్ట్ర ఆర్ధికశాఖ మంత్రి మన ఎంఎల్ఏ బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డిని తిరిగి గెలిపించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తిరుమలేశ్వర్ రెడ్డి, చింతల నాగిరెడ్డి, గోరుమానుకొండ సర్పంచ్ కోడె వెంకటేశ్వర్లు, బలపాలపల్లె చిన్న ఎద్దులన్న, వార్డుకౌన్సిలర్ కోట్ల మధు, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News