Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Bethamcharla: 23వ రోజున టీడీపీ రిలే నిరాహార దీక్షలు

Bethamcharla: 23వ రోజున టీడీపీ రిలే నిరాహార దీక్షలు

నిరాహారదీక్షలో కూర్చున్న మహిళలు

నారా చంద్రబాబు నాయుడు అరెస్టుని నిరసిస్తూ బాబుతో ‘మేము సైతం’ అంటూ డోన్ లో రిలే నిరాహార దీక్షలు 23వ రోజుకు చేరాయి. బేతంచేర్ల మండలం, హెచ్. కొట్టాల గ్రామ మహిళలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షా శిబిరంలో బేతంచెర్ల మండలం హెచ్. కొట్టాల గ్రామ మహిళలు నాగమణి, జ్యోతి, లక్ష్మీ దేవి, నారాయణమ్మ, గీతమ్మ, ప్రమీల, నాగలక్ష్మమ్మ, రమాదేవి, పుల్లమ్మ, నీలవతి, దేవమ్మ, లక్ష్మీదేవి, సుజాత, నాగరాణి, పుష్పవతి, మాధవి, పార్వతి,రాధ, రుక్మిణీ, అనురాధ తదితరులు దీక్షలో పాల్గొన్నారు. ఈ
దీక్షా శిబిరాన్ని డోన్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి ధర్మారం మన్నె సుబ్బారెడ్డి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వలసల రామకృష్ణ,నంద్యాల జిల్లా టిడిపి ఉపాధ్యక్షులు పోలూరు వేంకటేశ్వరెడ్డి, మాజీ జెడ్పీటీసీ పద్మావతమ్మ, డోన్ మండలం టిడిపి అధ్యక్షులు సలీంద్ర శ్రీనివాసులు యాదవ్, ప్యాపిలి మండలం టిడిపి అధ్యక్షులు గండికోట రామసుబ్బయ్య, డోన్ నియోజకవర్గ టిడిపి యువ నాయకులు ధర్మవరం మన్నే గౌతమ్ రెడ్డి, డోన్ పట్టణ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ రఫీ, క్లస్టర్ ఇంచార్జ్ గోవిందు, గోవిందరెడ్డి , యోగేంద్ర బాబు, మహేష్ తదితరులు సందర్శించి,సంఘీభావం తెలిపారు.అట్లాగే బాబు షూరిటీ – భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమాన్ని బేతంచెర్ల నగర పంచాయితీ పరిధి, రజక వీధిలో 272 బూత్ లో క్లస్టర్ ఇంచార్జ్ షేక్షావలి చౌదరి, బూత్ కన్వీనర్ లోకేశ్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News