Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Bhuma Akhila: వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయం

Bhuma Akhila: వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయం

నంద్యాల పట్టణంలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ నివాసం వద్ద భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నిక విజయాన్ని పురస్కరించుకొని సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ కేక్ కట్ చేశారు, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించినందుకు పశ్చిమ రాయలసీమ పట్టబద్ధులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారని ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వానికి చరమ గీతం పాడే రోజులు దగ్గరే ఉన్నాయని, నారా చంద్రబాబునాయుడు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఏవిఆర్ ప్రసాద్, కొండారెడ్డి, మన్నే కృపాకర్, భాస్కర్ రెడ్డి, అజ్మీర్, చాంద్బాషా, మోహన్ రెడ్డి, సురేష్, జార్జి శరత్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News