Saturday, November 15, 2025
Homeఆంధ్రప్రదేశ్Bhuma Karunakar : TTD ఛైర్మన్‌గా BR నాయుడు అట్టర్ ఫ్లాప్ – భూమన్ కరుణాకర్...

Bhuma Karunakar : TTD ఛైర్మన్‌గా BR నాయుడు అట్టర్ ఫ్లాప్ – భూమన్ కరుణాకర్ రెడ్డి

Bhuma Karunakar Criticism BR Naidu : YSRCP మాజీ ఎంపీ, పార్టీ సీనియర్ నేత భూమన్ కరుణాకర్ రెడ్డి TTD చైర్మన్ BR నాయుడు పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏడాది పూర్తి అయినా BR నాయుడు పాలనలో ఏమీ సానుకూలం జరగలేదని, అట్టర్ ఫ్లాప్ ఛైర్మన్ అని ఆరోపించారు. “BR నాయుడు వచ్చాక తిరుమల దేవాలయ స్వచ్ఛత తగ్గింది?” అంటూ భూమన్ తెలిపారు.

- Advertisement -

BR నాయుడు ఏడాది పాలనలో ఏమీ చేయలేదని నొక్కి చెప్పారు. శ్రీవాణి ట్రస్ట్ టికెట్లను రద్దు చేస్తామని ప్రకటించారు కానీ, భారీగా అవకతవకాలు జరిగాయని ఆరోపించారు. “ఇటీవల TTD విరాళాలు వచ్చాయని ప్రకటించారు. మొత్తం వెయ్యి కోట్ల రూపాయల విరాళాల్లో 500 కోట్లు శ్రీవాణి నుంచే వచ్చాయని” భూమన్ హైలైట్ చేశారు. “టికెట్లు రద్దు చేస్తామని చెప్పి, విరాళాల ద్వారా మార్గం తీసుకున్నారు. ఇది దారుల మార్పు కాదు, మోసం” అని వ్యాఖ్యానించారు. TTD బోర్డు సమావేశంలో ఈ విరాళాలు ప్రకటించబడినప్పటికీ, ఇది ప్రజల విశ్వాసాన్ని మరింత కోల్పోయేలా చేస్తోందని తెలిపారు.

గోశాలల విషయంను కూడా భూమన్ తీవ్రంగా ఖండించారు. TTD గోశాలల్లో ఆవులు చనిపోతున్నాయని, ఆహారం, వైద్య సౌకర్యాలు లేకపోవడమే ఇందుకు కారణమని తెలిపారు. “నేను ఈ విషయం లేవనెత్తినప్పుడు నాపై కేసులు పెట్టారు. ఇప్పుడు గోశాల నిర్వహణను స్వచ్ఛంద సంస్థలకు ఇస్తున్నారు. ఇది బాధ్యత నుంటి తప్పించుకోవటమే” అని ఆరోపించారు. TTD గోశాలల్లో 5,000కి పైగా ఆవులు ఉన్నాయని, అయితే మరణాలు 20% పెరిగాయని,  మునుపటి YSRCP పాలనలో గోశాలలు మెరుగ్గా నడిచాయని, BR నాయుడు వచ్చాక ఈ సమస్యలు తీవ్రమయ్యాయని తెలిపారు.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad