Saturday, September 21, 2024
Homeఆంధ్రప్రదేశ్Bhuma Kishore: క్రీడాకారులు క్రీడల పట్ల ఆసక్తి పెంచాలి

Bhuma Kishore: క్రీడాకారులు క్రీడల పట్ల ఆసక్తి పెంచాలి

క్రీడాకారులకు తన సహకారం ఎప్పుడూ ఉంటుందని భరోసా..

క్రీడాకారులు క్రీడల పట్ల ఆసక్తి కనపరచాలని బిజెపి సీనియర్ నాయకుడు భూమా కిషోర్ రెడ్డి అన్నారు. నంద్యాల బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ రఘు ప్రకాష్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి జనరల్ సెక్రెటరీ, స్పోర్ట్స్ సెక్రటరీ ప్రసాద్ రెడ్డి, ఆళ్లగడ్డ సెక్రెటరీ అంబటి గోపాల్ రెడ్డి, భూమా కిషోర్ రెడ్డిని కలిశారు. అనంతరం వారికి క్రికెట్ కిట్టు అందజేసి క్రీడాకారులకు తన సహకారం ఎప్పుడూ ఉంటుందని భూమా కిషోర్ రెడ్డి తెలిపారు. అంబటి మహేష్ రెడ్డి హుస్సేన్ రెడ్డి, శంకర్ రెడ్డి, ప్రకాష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

- Advertisement -

నిరుద్యోగులు స్వయం ఉపాధి వైపు దృష్టి సారించాలి
పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్దడయాగ్నసిస్ సెంటర్ ను నియోజకవర్గ బిజెపి ఇన్చార్జి భూమా కిషోర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగులు కేవలం ప్రభుత్వ ఉద్యోగాలపైన ఆధారపడకుండా స్వయం ఉపాధి మార్గాలని ఎంచుకుని ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మహేశ్వర్ రెడ్డి హుస్సేన్ రెడ్డి శంకర్ రెడ్డి, బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News