Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Budda Rajasekhar: వరాల జల్లులు కురిపించిన బుడ్డా

Budda Rajasekhar: వరాల జల్లులు కురిపించిన బుడ్డా

ముస్లిం మైనారిటీ ప్రజావేదికలో..

తెలుగుదేశం పార్టీ శ్రీశైలం నియోజక వర్గం మాజీ శాసన సభ్యులు బుడ్డా రాజశేఖర్ రెడ్డికి ఆత్మకూరు కొత్త పేట ముస్లిం మైనారిటీ సోదరులు ఘన స్వాగతం పలికారు. ముస్లిం మైనారిటీ ప్రజా వేదిక కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ముస్లిం మైనారిటీలకు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అనేక సంక్షేమ పథకాలు అమలుచేసి ముస్లిం మైనారిటీల అభివృద్ధికి కృషిచేసిన సంగతి గుర్తుచేశారు. నేటి జగన్ రెడ్డి పాలనలో ముస్లిం మైనారిటీ వక్ఫ్ భూములు,పేద కుటుంబాలకు చెంది న ఖరీదైన భూములను ఆక్రమించుకొని తిరిగి భాదితులు పైనే అక్రమ కేసులు నమోదు చేసి జైలుకు పంపుతున్నారు అని అన్నారు. కాబట్టి ముస్లిం మైనారిటీల సంక్షేమం కోసం వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీని గెలిపించి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా గెలిపించండి. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆత్మకూరులో అసంపూర్ణంగా ఉన్న షాదీఖాన సంపూర్ణంగా నిర్మాణం చేపిస్తానని, స్మశాన వాటికకు 10 ఎకరాలు భూమి, పేద ముస్లిం మైనారిటీ కుటుంబాలకు ఇంటి స్థలాలు, ఇంటి నిర్మాణం పూర్తి చేసి ఇస్తానని, ఇంటి పన్నులు తగ్గించి, ముస్లిం మైనారిటీల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ యువత అభివృద్ధి కోసం సంక్షేమం అమలు చేస్తామని హామీలు ఇవ్వడంతో ముస్లిం మైనారిటీల కార్యకర్తలు హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ, మండల, జిల్లా ముస్లిం మైనారిటీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News