Saturday, November 15, 2025
Homeఆంధ్రప్రదేశ్Jagan: జగన్ లండన్ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి

Jagan: జగన్ లండన్ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్(Jagan) లండన్ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నెల 11 నుంచి 30వ తేదీ వరకు లండన్ వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉత్తర్వలు జారీ చేసింది. తన కుమార్తె గ్రాడ్యుయేషన్ డే కోసం లండన్ వెళ్లేందుకు అనుమతించాలని సీబీఐ కోర్టును జగన్ విజ్ఞప్తి చేశారు. ఆయన విన్నపం పట్ల సానుకూలంగా స్పందించిన న్యాయస్థానం 20 రోజుల పాటు లండన్ వెళ్లేందుకు అనుమతించింది.

- Advertisement -

మరోవైపు హైకోర్టులోనూ జగన్‌కు ఊరట లభించిన సంగతి తెలిసిందే. పాస్ పోర్ట్ పొందేందుకు నిరభ్యంతర పత్రం జారీ చేసింది. ఐదేళ్ల కాలపరిమితితో జగన్‌కు పాస్ పోర్ట్ ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. NOC కోసం జగన్ వేసిన పిటిషన్ కొట్టేస్తూ విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad