Saturday, April 26, 2025
Homeఆంధ్రప్రదేశ్Andhra Pradesh: ఏపీకి రూ.1,121 కోట్ల నిధులు విడుదల చేసిన కేంద్రం

Andhra Pradesh: ఏపీకి రూ.1,121 కోట్ల నిధులు విడుదల చేసిన కేంద్రం

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. రాష్ట్రంలోని జిల్లా, మండల పరిషత్‌లు, పంచాయతీలకుగానూ 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేసింది. ఈ మేరకు 2024-25 ఆర్థిక సంవత్స‌రానికి సంబంధించిన నిధుల‌ను విడుద‌ల చేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. మొత్తం రూ.1,121.20 కోట్లు నిధులు విడుదల చేయగా.. అందులో పంచాయతీలకు 70 శాతం నిధులు, మండల పరిషత్తులకు 20 శాతం, జిల్లా పరిషత్తులకు 10 శాతం కేటాయించింది. జనాభా ఆధారంగా గ్రామీణ స్థానిక సంస్థల బ్యాంకు ఖాతాలకు ఆర్థిక శాఖ అనుమ‌తితో పంచాయ‌తీ రాజ్ శాఖ నిధులను జమ చేయనుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News