Sunday, July 7, 2024
Homeఆంధ్రప్రదేశ్Chandrababu: అది శాసనసభ కాదు కౌరవ సభ, ఇది చీకటి రోజు

Chandrababu: అది శాసనసభ కాదు కౌరవ సభ, ఇది చీకటి రోజు

తెలుగు దేశం ఎమ్మెల్యేలపై దాడి జరిగిందని, అసెంబ్లీలో జరిగిన దాడిని టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఖండించారు. రాష్ట్ర శాసనసభలో ఎమ్మెల్యేపై దాడి రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ జరగలేదన్న చంద్రబాబు.. సీఎం జగన్ ప్రోద్భలంతో తమ నేతలపై దాడి జరిగిందని విరుచుకుపడ్డారు. అసెంబ్లీ చరిత్రలో ఇవాళ చీకటి రోజంటూ చంద్రబాబు ఆవేదన వ్యక్తంచేశారు. తమ ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామిపై దాడి చేశారని, అది శాసనసభ కానేకాదని, అది కౌరవ సభ అంటూ ఆయన నిప్పులు చెరిగారు. ఈ మొత్తం వ్యవహారంపై కాసేపట్లో టీడీపీ నేతలంతా సమావేశమై, తదుపరి కార్యచరణకు సిద్ధం కానున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News