Saturday, November 15, 2025
Homeఆంధ్రప్రదేశ్CM Kuppam Industries inauguration : కుప్పంలో ఒకేరోజు 7 పరిశ్రమలకు సీఎం శంకుస్థాపన

CM Kuppam Industries inauguration : కుప్పంలో ఒకేరోజు 7 పరిశ్రమలకు సీఎం శంకుస్థాపన

CM Kuppam 7 industries inauguration : ఏపీ సీఎం చంద్రబాబు తన సొంత నియోజకవర్గమైన కుప్పాన్ని పారిశ్రామిక హబ్‌గా మార్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఒకేరోజు రూ.2,203 కోట్ల పెట్టుబడులతో వర్చువల్‌గా ఏకంగా ఏడు భారీ పరిశ్రమలకు శంకుస్థాపన చేశారు.
కుప్పంలో సీఎం చంద్రబాబు రూ.2,203 కోట్ల పెట్టుబడులతో 241 ఎకరాల్లో ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ పరిశ్రమల ద్వారా ప్రత్యక్షంగా 5,000 మందికి, పరోక్షంగా 17,330 మందికి ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఒకప్పుడు కరువు, వెనుకబాటుతనంతో ఇబ్బందిపడిన కుప్పం ఇకపై ఆర్థిక శక్తిస్థలంగా మారనుందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. కుప్పం, కొండపూల, మదనపల్లె, పాల్మనేరు, వెల్లోరు, చిత్తూరు ప్రాంతాల్లో ఏర్పాటు అవుతున్న ఈ పరిశ్రమల్లో దేశవ్యాప్తంగా పేరుగాంచిన కంపెనీలు పాల్గొంటున్నాయి.

- Advertisement -

ALSO READ: Fee Reimbursement: ఫీజులు ఇచ్చేది ఎప్పుడు బాబూ?

ఈ పరిశ్రమల్లో భాగంగా ఆదిత్య బిర్లా గ్రూప్‌కు చెందిన హిందాల్కో రూ.586 కోట్లతో మొబైల్, ల్యాప్‌టాప్ వంటి ఎలక్ట్రానిక్స్ విడిభాగాల తయారీ యూనిట్‌ను ప్రారంభిస్తోంది. ఇది ఐటీ, టెక్ రంగాల్లో 1,200 మందికి ఉద్యోగాలు కల్పిస్తుంది. శ్రీజా డైరీ రూ.290 కోట్లతో సమగ్ర డెయిరీ ప్లాంట్, పశువుల మేత యూనిట్‌ను, ఏస్ ఇంటర్నేషనల్ రూ.525 కోట్లతో గ్రీన్‌ఫీల్డ్ డెయిరీ కాంప్లెక్స్‌ను, మదర్ డైరీ రూ.260 కోట్లతో పండ్ల రసాల, జ్యూస్ ప్రాసెసింగ్ యూనిట్‌ను స్థాపిస్తున్నాయి. ఎస్వీఎఫ్ సోయా రూ.373 కోట్లతో వంట నూనెల తయారీని, ఇ-రాయిస్ ఈవీ రూ.200 కోట్లతో ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీ) తయారీని ప్రారంభిస్తుంది. అలీప్ సంస్థ రూ.27 కోట్లతో మహిళలకు ప్రత్యేక ‘మహిళా శక్తి భవన్’ పార్క్‌ను నిర్మిస్తుంది. ఇక్కడ 4,000 మంది మహిళలకు శిక్షణ, ఉపాధి లభించే అవకాశం కనిపిస్తోంది.

ఈ ప్రాజెక్టులు కేవలం ఉద్యోగాలు కల్పించడమే కాకుండా, స్థానిక రైతులకు భారీ ప్రయోజనం చేకూరుస్తున్నాయి. డెయిరీ, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు రోజుకు 4 లక్షల లీటర్ల పాలు, పండ్లు, సోయా, పాడి వంటి పంటలను కొనుగోలు చేస్తాయి. దీంతో రైతులకు మంచి ధరలు, మార్కెట్ అవకాశాలు లభిస్తాయి. ఇక ప్రాజెక్టులపై మాట్లాడిన చంద్రబాబు “కుప్పం భౌగోళిక స్థానం దృష్టిలో ఉంచుకొని తమిళనాడు, కర్ణాటకలతో లింకేజ్‌లు ఏర్పాటు చేస్తాము. సింగిల్ విండో సిస్టమ్‌తో అనుమతులు త్వరగా ఇస్తాము. త్వరలో స్పేస్ సిటీ, డ్రోన్ సిటీలు వస్తాయి” అని ప్రకటించారు. హంద్రీ-నీవా నీటి ప్రాజెక్ట్‌తో 700 కిమీల దూరం నుంచి నీటిని తీసుకువచ్చి, తాగునీరు, సాగునీరు, పారిశ్రామిక అవసరాలు తీర్చుతామని హామీ ఇచ్చారు.

త్వరలో మరో 8 కంపెనీలు రూ.6,339 కోట్ల పెట్టుబడితో రానున్నాయి. బ్యాటరీ టెక్, మెడికల్ డివైసెస్, ఫుడ్ లాజిస్టిక్స్ రంగాల్లో 43 వేల ఉద్యోగాలు రానున్నాయి. “వన్ ఫ్యామిలీ-వన్ ఎంటర్‌ప్రెన్యూర్, వన్ ఫ్యామిలీ-వన్ ఏఐ నిపుణుడు పాలసీలతో మహిళలు, యువతను శక్తివంతులను చేస్తాము. సూపర్ సిక్స్ హామీలు సూపర్ హిట్ అవుతాయి” అని చంద్రబాబు పునరుద్ఘాటించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad