Saturday, November 15, 2025
Homeఆంధ్రప్రదేశ్Chandrababu Naidu Market Yards Master Plan : రైతుకు సరైన ధర దక్కాలి, వినియోగదారుడికి...

Chandrababu Naidu Market Yards Master Plan : రైతుకు సరైన ధర దక్కాలి, వినియోగదారుడికి ధర తగ్గాలి – సీఎం

Chandrababu Naidu Market Yards Master Plan : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చేందుకు కీలక చర్యలు ప్రకటించారు. “రైతు పంటకు సరైన ధర దక్కాలి, అదే సమయంలో వినియోగదారుడు అధిక ధర చెల్లించకూడదు. ఈ రెండింటినీ సమన్వయం చేయడమే మా లక్ష్యం” అని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అక్టోబర్ 9న సచివాలయంలో వ్యవసాయ, మార్కెటింగ్, అనుబంధ రంగాల సమీక్షలో మాట్లాడారు. మంత్రి అచ్చెన్నాయుడు, కార్పొరేషన్ చైర్మన్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

ALSO READ: Bandi Sanjay On Local Elections 2025 : స్థానిక ఎన్నికల్లో గెలవకపోతే ఇజ్జత్ పోతుందయ్యా! ఏమనుకుంటున్నారు? – బండి సంజయ్

రాష్ట్రవ్యాప్తంగా 218 వ్యవసాయ మార్కెట్ యార్డుల అభివృద్ధికి సమగ్ర మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని సూచించారు. “మార్కెట్ యార్డుల్లో కోల్డ్ చైన్, అగ్రి ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయండి. ఖాళీ భూములు సద్వినియోగం చేసుకోండి” అన్నారు. రైతు బజార్ల ఆధునికీకరణపై దృష్టి సారించి, పట్టణ ప్రాంతాల్లో అవసర భూమి అంచనా వేయాలని చెప్పారు. మొబైల్ రైతు బజార్ల ఏర్పాటు ఆలోచనను పరిశీలించాలని ఆదేశించారు. ఇటీవల పత్తికొండలో టమాటో ధరలు పడిపోయినట్టు అలాంటి సందర్భాల్లో పంటను రైతు బజార్లకు తరలించి, ప్రజలకు తక్కువ ధరలకు అందించాలని సూచించారు. మార్కెట్ కమిటీలు, రైతు బజార్లను కలిపి ఒక కార్పొరేషన్‌గా ఏర్పాటు చేసి నిధుల సమీకరణ చేయాలని తెలిపారు.

రసాయన ఎరువుల మితిమీరిన వాడకంపై ఆందోళన వ్యక్తం చేశారు. “ఎక్కువ యూరియా వేస్తే దిగుబడి పెరుగుతుందనే అపోహతో భూసారం పాడవుతోంది. ప్రజల ఆరోగ్యం కూడా ప్రభావితమవుతోంది” అని అన్నారు. 2026 ఖరీఫ్ సీజన్‌కు సేంద్రీయ సాగు విస్తరణ, రసాయన ఎరువుల తగ్గింపుకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. భూసార పరీక్షల ఆధారంగా పోషకాలు, ప్రకృతి సేద్యం ప్రయోజనాలు రైతులకు వివరించాలని చెప్పారు. రైతు సేవా కేంద్రాలను పునర్వ్యవస్థీకరించి, అన్ని సేవలు అందించాలని సూచించారు.
రబీ సీజన్‌కు 23 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని అధికారులు తెలిపారు. “ఆధార్ ఆధారిత పంపిణీ చేయండి. అక్రమ రవాణాలు, అక్రమాలకు తావివ్వొద్దు” అని కఠిన హెచ్చరిక జారీ చేశారు. ప్రతి రైతు, కౌలు రైతుకు ఎంత యూరియా ఇచ్చారో రికార్డులు నిర్వహించాలని ఆదేశించారు. 2025-26కు ధాన్యం సేకరణ లక్ష్యం 51 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉంచి, రైతులకు టార్పాలిన్లు అందించాలని చెప్పారు.

ప్రధాని ప్రారంభించనున్న ‘పీఎం ధన్ ధాన్య కృషి యోజన’ ప్రయోజనాలు అధ్యయనం చేయాలని సూచించారు. సెరీకల్చర్‌లో కర్ణాటకతో పోలిస్తే ఏపీ వెనుకబడటంపై విశ్లేషణ చేయాలని, ఎంఎస్ఎంఈలకు పట్టు యంత్రాలు సబ్సిడీపై ఇవ్వాలని చెప్పారు. బిల్ గేట్స్ ఫౌండేషన్ సహకారం తీసుకోవాలని తెలిపారు. ఉల్లి, టమాటో, మిర్చి ధరలు పడిపోకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని, గిరిజన ప్రాంతాల్లో జీలుగు బెల్లం, వెదురు ఉత్పత్తులను అరకు కాఫీలా ప్రోత్సహించాలని, పుట్టగొడుగుల సాగును పెంచాలని సూచించారు. 2025-26కు వివిధ పంటల మద్దతు ధరల పోస్టర్‌ను విడుదల చేశారు.
ఈ చర్యలు రైతుల ఆదాయం పెంచి, ప్రజలకు తక్కువ ధరలు అందిస్తాయని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. ‘స్వర్ణాంధ్ర-2047’ లక్ష్యంతో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad