కడపలో తొలిసారిగా టీడీపీ నిర్వహించిన ‘మహానాడు'(Mahanadu) వేడుక ఘనంగా ముగిసింది. మూడు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమానికి లక్షలాది ప్రజలు, వందలాది మంది నాయకులు హాజరయ్యారు. తొలి రోజు పార్టీ కార్యక్రమాలు, రెండో రోజు ప్రభుత్వ కార్యక్రమాలపై చర్చించగా.. మూడో రోజు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు.
ఈ సభా వేదికపై ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. వేదికపైకి చేరుకున్న పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు(CM Chandrababu) సభ ఏర్పాట్లను చూసి సంతోషం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కడప జిల్లా అధ్యక్షులు, పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డెప్పగారి శ్రీనివాస్ రెడ్డిని భుజం తట్టి సీఎం మెచ్చుకున్నారు. దీంతో శ్రీనివాస్ రెడ్డి ఆనందభాష్పాలతో భావోద్వేగానికి గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.