Friday, June 13, 2025
Homeఆంధ్రప్రదేశ్Thalliki Vandanam: సూపర్ సిక్స్‌లో మరో కీలక హామీ గ్రీన్ సిగ్నల్

Thalliki Vandanam: సూపర్ సిక్స్‌లో మరో కీలక హామీ గ్రీన్ సిగ్నల్

సూపర్ సిక్స్‌లో మరో కీలక హామీకి సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఇప్పటికే పింఛన్ల పెంపు, అన్న క్యాంటీన్, మెగా డీఎస్సీ, దీపం-2 పథకాలను ప్రభుత్వం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక గురువారంతో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి అవుతున్న సందర్భంగా ‘తల్లికి వందనం'(Thalliki Vandanam) పథకం ప్రారంభించనున్నారు.

ఒక్కొక్కరికి రూ.15 వేలు చొప్పున 67,27,164 మంది తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం రూ.8,745 కోట్లు జమ చేయనుంది. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ ఈ పథకం వర్తింపజేస్తామని స్పష్టం చేసింది. ఒకటో తరగతి పిల్లలతో పాటు ఇంటర్ విద్యార్థులకూ తల్లికి వందనం అమలు చేయనుంది. ఆడ్మిషన్లు పూర్తి అయి డేటా అందుబాటులోకి రాగానే నిధులు జమచేస్తామని వెల్లడించింది.

ఈ నేపథ్యంలో లబ్ధిదారుల పిల్లల వివరాలను పక్కాగా సేకరిస్తోంది. పాఠశాల విద్యాశాఖ నుంచి తీసుకున్న పిల్లల వివరాల డేటాను నిశ్చితంగా పరిశీలిస్తోంది. అంతేకాకుండా గ్రామ, వార్డు సచివాలయ శాఖ వద్ద ఉన్న డేటాతో అనుసంధానం చేసి పరిశీలన చేయిస్తోంది. ఇంటింటి సర్వే డేటా ఆధారంగా తల్లికి వందనం స్కీమ్ లబ్ధిదారులను ఎంపిక చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఈ పథకం కింద డబ్బులు పొందాలంటే విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాను ఆధార్ నంబర్ తో పాటు ఎన్పీసీఐతో లింక్ అయి ఉండాలి. ఈకైవైసీ ప్రక్రియ తప్పకుండా పూర్తి చేసుకోవాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. లేకుండా డబ్బుల చెల్లింపు ప్రక్రియలో ఇబ్బందులు తలెత్తుతాయని అంటున్నారు.

అర్హతలు:


* ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివసిస్తూ ఉండాలి.
* ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాల/ కాలేజీల్లో విద్యార్థి చదువుతూ కనీసం 75 శాతం హాజరు కలిగి ఉండాలి.
* తల్లి పేరిట బ్యాంక్ ఖాతా ఉండాలి.
* కుటుంబ వార్షిక ఆదాయం ప్రభుత్వం నిర్దేశించిన పరిమితిలో ఉండాలి.

అవసరమైన పత్రాలు:


* విద్యార్థి స్టడీ సర్టిఫికేట్
* తల్లి ఆధార్ కార్డు
* తల్లి బ్యాంక్ ఖాతా వివరాలు
* నివాస రుజువు (రేషన్ కార్డు లేదా ఇతర పత్రం)
* కుల ధ్రువీకరణ పత్రం
* ఆదాయ ధ్రువీకరణ పత్రం
* పాఠశాల హాజరు పత్రం

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News