Thursday, March 6, 2025
Homeఆంధ్రప్రదేశ్Chandrababu: కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ

Chandrababu: కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ

ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు(Chandrababu) బిజీబిజీగా గడుపుతున్నారు. కేంద్రమంత్రులను కలుస్తూ రాష్ట్ర అభివృద్ధి గురించి చర్చించారు. ముందుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah)తో ఆయన భేటీ అయ్యారు. పాలనా వ్యవహారాలు, తాజాగా రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం. అలాగే ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానానికి అభ్యర్థి ఎంపికపై చర్చ జరిగినటగ్లు సమాచారం.

- Advertisement -

ఇక కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తోనూ చంద్రబాబు సమావేశం అయ్యారు. ఏపీకి రావాల్సిన నిధులు, పలు ప్రాజెక్టుల అంశాలపై చర్చించారు. గురువారం ప్రధాని మోదీతో పాటు మరికొంతమంది కేంద్ర మంత్రులను కలిసే అవకాశముంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News