Saturday, November 15, 2025
Homeఆంధ్రప్రదేశ్Chandrababu Naidu: 'రైతులు, మహిళలకు ఆ సౌకర్యాలు కల్పించనున్నాం'

Chandrababu Naidu: ‘రైతులు, మహిళలకు ఆ సౌకర్యాలు కల్పించనున్నాం’

Chandrababu Naidu Annadata SukhiBhava: రైతులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తెచ్చి, వారి సమస్యలను పరిష్కరించేందుకు కట్టుబడి ఉన్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రకాశం జిల్లా దర్శి మండలం తూర్పు వీరాయపాలెంలో ‘అన్నదాత సుఖీభవ’ పథకాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులతో ముఖాముఖి నిర్వహించి, వారి సమస్యలను స్వయంగా విన్న సీఎం, వాటిని తక్షణం పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

- Advertisement -

రైతులకు లాభదాయక పంటల సూచనలు
రైతులకు లాభసాటిగా ఏ పంటలు వేయాలో అధ్యయనం చేసి సలహాలు ఇస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఆధునిక సాంకేతికతను రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చి, వ్యవసాయ ఉత్పాదకతను పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. పొలాల వద్ద వినూత్నంగా ఏర్పాటు చేసిన వేదికపై రైతులతో సంభాషించిన సీఎం, లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు.

46.85 లక్షల మంది రైతులకు సాయం
‘అన్నదాత సుఖీభవ’ పథకం ద్వారా రాష్ట్రంలో 46,85,838 మంది రైతులు లబ్ధి పొందనున్నారు. మొదటి విడతలో రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో రైతుకు రూ.5,000, కేంద్ర ప్రభుత్వం ‘పీఎం కిసాన్’ పథకం కింద రూ.2,000 అందజేస్తోంది. మొత్తంగా ఒక్కో రైతుకు రూ.7,000 జమ చేయగా, సంవత్సరానికి కేంద్ర, రాష్ట్ర సాయంతో రూ.20,000 అందనుంది.

Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/journalist-patri-vasudevan-goes-missing-after-controversial-remarks-on-ex-cm-jagan-police-took-legal-action/

సూపర్ సిక్స్ పథకాలతో సంక్షేమం
‘రైతే రాజుగా మారాలి, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలి’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. సూపర్ సిక్స్ పథకాల అమలుతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని ఆయన ఆకాంక్షించారు. గత ప్రభుత్వం అరాచక పాలనతో ప్రజల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టిందని విమర్శించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సహకారంతో, రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీతో పొత్తు పెట్టినట్లు తెలిపారు.

వితంతు పింఛన్ల పునరుద్ధరణ
గత ప్రభుత్వం రద్దు చేసిన వితంతు పింఛన్లను తమ ప్రభుత్వం తిరిగి అమలులోకి తెచ్చిందని సీఎం వెల్లడించారు. లబ్ధిదారులకు వారి ఇంటి వద్దే పింఛన్ అందిస్తున్నామని, ఏపీలో పింఛన్ల కోసం సంవత్సరానికి రూ.32,000 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. ఇది తెలంగాణ ఖర్చు (రూ.8,000 కోట్లు) కంటే నాలుగు రెట్లు ఎక్కువని ఆయన పేర్కొన్నారు.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
ఆగస్టు 15 నుంచి స్త్రీశక్తి పథకం ద్వారా రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని సీఎం ప్రకటించారు. దీని ద్వారా దాదాపు 2.62 కోట్ల మంది మహిళలు లబ్ధి పొందనున్నారు. రాష్ట్రంలో ఎక్కడికైనా మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని ఆయన వివరించారు.

Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/cm-chandrababu-launches-annadatha-sukheebhava-scheme-today/

బీజేపీతో సమన్వయం, అభివృద్ధి లక్ష్యం
కేంద్రంలో బీజేపీ నాలుగోసారి అధికారంలోకి వస్తుందని సీఎం చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీతో సమన్వయంతో పనిచేస్తామని తెలిపారు. ఉగ్రవాదాన్ని అణచివేసి, ప్రజలకు హాని జరగకుండా చూశామని ఆయన చెప్పారు. అభివృద్ధి చేయడంలో తెదేపా నైపుణ్యం కలిగిన పార్టీ అని పేర్కొన్నారు.

కాగా, ఈ కార్యక్రమంలో మంత్రులు అచ్చెన్నాయుడు, ఆనం రామనారాయణరెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad