Tuesday, February 18, 2025
Homeఆంధ్రప్రదేశ్CM Chandrababu: మహాత్మా జ్యోతిరావు పూలేకు సీఎం చంద్రబాబు నివాళులు

CM Chandrababu: మహాత్మా జ్యోతిరావు పూలేకు సీఎం చంద్రబాబు నివాళులు

CM Chandrababu| బీసీల ఆరాధ్య నాయకుడు మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి ఏపీ సీఎం చంద్రబాబు ఆయనకు నివాళులర్పించారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. “మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా వారికి నా ఘన నివాళి అర్పిస్తున్నాను. బడుగు బలహీన వర్గాల సముద్దరణకు ఆయన చూపిన బాట అనుసరణీయం. అదే స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అని ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను” అని ఆయన తెలిపారు.

- Advertisement -

ఇదిలా ఉంటే చంద్రబాబు ప్రస్తుతం ఆయన స్వగ్రామం నారావారి పల్లెలో ఉన్నారు. ఆయన సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు దశదిన కార్యక్రమంలో పాల్గొనేందుకు కుటుంబంతో కలిసి అక్కడి వెళ్లారు. ఈ కార్యక్రమం అనంతరం తిరిగి ఉండవల్లి చేరుకుంటారు. కాగా ఇటీవల అనారోగ్యంతో రామ్మూర్తి నాయుడు కన్నుమూసిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News