Sunday, June 8, 2025
Homeఆంధ్రప్రదేశ్CM Chandrababu: టీడీపీ నేత అంత్యక్రియల్లో పాల్గొననున్న సీఎం చంద్రబాబు

CM Chandrababu: టీడీపీ నేత అంత్యక్రియల్లో పాల్గొననున్న సీఎం చంద్రబాబు

ప్రకాశం జిల్లా ఒంగోలులో టీడీపీ నాయకుడు, నాగులుప్పలపాడు మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. ఆయన హత్య పట్ల సీఎం చంద్రబాబు(CM Chandrababu), మంత్రి నారా లోకేశ్, ఇతర మంత్రులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరోవైపు ఇవాళ మధ్యాహ్నం నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలులో వీరయ్య చౌదరి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ అంత్యక్రియల్లో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా వీరయ్య కుటుంబాన్ని పరామర్శించనున్నారు.

- Advertisement -

ఇదిలా ఉంటే ఒంగోలు మాజీ ఎమ్మెల్యే ఈదర హరిబాబుకు వీరయ్య చౌదరి స్వయాన మేనల్లుడు. మేనల్లుడు హత్యకు గురయ్యాడనే సమాచారంతో హరిబాబు గుండెపోటుకు గురయ్యారు. దీంతో హుటాహుటిన రిమ్స్ ఆస్పత్రికి వెళ్లారు. అయితే మెరుగైన చికిత్స కోసం సంఘమిత్రా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News