Friday, June 20, 2025
Homeఆంధ్రప్రదేశ్CM Revanth Reddy: ఏపీతో వివాదాలు కోరుకోవడం లేదు: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: ఏపీతో వివాదాలు కోరుకోవడం లేదు: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: ఏపీ ప్రభుత్వం చేపట్టబోతున్న బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణలో రాజకీయ కాక రేపుతోంది. తెలంగాణ ప్రయోజనాలను సీఎం రేవంత్ రెడ్డి ఏపీకి తాకట్టు పెడుతున్నారని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ముఖ్యంగా మాజీ మంత్రి హరీశ్‌ రావు అయితే బనకచర్ల ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఆల్ పార్టీ ఎంపీలు మీటింగ్ నిర్వహించారు. బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకుంటామని తెలిపారు. గోదావరి, కృష్ణా నదిలో తెలంగాణ రావాల్సిన వాటాను న్యాయపరంగా సాధించుకుంటామని స్పష్టంచేశారు.

- Advertisement -

ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ సందర్భంగా ఈ ప్రాజెక్టు గురించి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాజెక్టు విషయంలో ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు కూర్చుని మాట్లాడుకుంటే ఎలాంటి వివాదం ఉండదన్నారు. ఏపీతో తాము ఎలాంటి వివాదాలు కోరుకోవడం లేదన్నారు. జూన్ 23న నిర్వహించనున్న మంత్రివర్గ సమావేశంలో ఈ ప్రాజెక్టుపై చర్చిస్తామన్నారు. కేబినెట్ భేటీ అనంతరం ఏపీ ప్రభుత్వాన్ని బనకచర్లపై చర్చలకు ఆహ్వానిస్తామని తెలిపారు. కావాలంటే ఏపీ సీఎం చంద్రబాబును తానే స్వయంగా మీటింగ్‌కు ఆహ్వానిస్తామని చెప్పారు. ఎవరి ప్రయోజనాల కోసమో తమ రాష్ట్ర హక్కులను వదిలేసుకోబోమని మరోసారి స్పష్టం చేశారు.

అసలు ఏపీ ప్రభుత్వం ఫీజిబిలిటీ రిపోర్టును కేంద్రానికి ఇవ్వడం వల్లే వివాదం మొదలైందని చెప్పారు. కేంద్రం కూడా ఏపీ పీఎఫ్ఆర్ ఇచ్చిన వెంటనే స్పందిస్తోందన్నారు. కేంద్రానికి పీఎఫ్ఆర్ ఇచ్చే ముందే తెలంగాణతో ఏపీ ప్రభుత్వం చర్చించి ఉంటే సమస్య ఉండేది కాదన్నారు. అన్ని రాష్ట్రాలతో సత్సంబంధాలను కోరుకుంటున్నామని తెలిపారు. బనకచర్ల ప్రాజెక్టుకు పునాది పడింది కేసీఆర్ హయాంలో అని.. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో సెంటిమెంటును అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్ ఇంతకాలం బతికిందకన్నారు. ఇప్పుడు ఆ పార్టీ రాజకీయంగా చచ్చిపోయింది అని ఎద్దేవా చేశారు.

ఇక పొడుగ్గా పెరిగినంత మాత్రాన తెలివి ఉందనుకోవడం సరైనది కాదని మాజీ మంత్రి హరీష్ రావుపై సెటైర్లు వేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్, హరీశ్ రావులు అడ్డగోలు తప్పులు చేశారని ముఖ్యమంత్రి ఆరోపించారు. ఎంపీ ఎన్నికల్లో బీజేపీ గెలిచేందుకు బీఆర్ఎస్ పార్టీ ఫండ్ డొనేట్ చేసిందని.. దీంతో ఆ పార్టీ 8 ఎంపీ సీట్లలో విజయం సాధించిందని పేర్కొన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. కేటీఆర్ చెప్పినట్లు నడుచుకుంటారని ఆరోపణలు చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News