Saturday, November 15, 2025
Homeఆంధ్రప్రదేశ్Ap Govt: సూపర్ సిక్స్ సూపర్ హిట్.. పెద్దగా ప్లాన్ చేసిన కూటమి ప్రభుత్వం

Ap Govt: సూపర్ సిక్స్ సూపర్ హిట్.. పెద్దగా ప్లాన్ చేసిన కూటమి ప్రభుత్వం

Ap Govt: అనంతపురం, ఇంద్రప్రస్థనగర్‌లో కూటమి ప్రభుత్వం ఈ నెల 10న భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో, ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన “సూపర్ సిక్స్” హామీలను ఎలా అమలు చేసిందో ఈ సభ ద్వారా ప్రజలకు వివరించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్, బీజేపీ నేతలతో పాటు పలువురు నాయకులు ఈ సభకు హాజరుకానున్నారు.

- Advertisement -

‘అన్నదాత సుఖీభవ’, ‘తల్లికి వందనం’, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి కీలక హామీలను ప్రభుత్వం ఇప్పటికే అమలు చేసింది. ఈ పథకాల ద్వారా ప్రజలకు లక్ష కోట్ల రూపాయలకు పైగా సంక్షేమం, అభివృద్ధి ఫలాలు అందాయని కూటమి నాయకత్వం వెల్లడించనుంది. ఈ సభ ద్వారా తమ పాలనలో సాధించిన విజయాలను ప్రజలకు తెలియజేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఎన్నికల ముందు సీట్ల సర్దుబాటుతో ఐక్యంగా ముందుకు సాగిన కూటమి పార్టీలు, అధికారంలోకి వచ్చాక కూడా అదే సమన్వయంతో పనిచేస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రధాని మోదీతో సంప్రదింపులు జరుపుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా కలిసికట్టుగా ఉంటామని ఈ సభ ద్వారా ప్రజలకు బలమైన సంకేతం ఇవ్వాలని కూటమి నేతలు భావిస్తున్నారు.

ఈ సభలో సూపర్ సిక్స్ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు 15 నెలల పాలనా విజయాలను కూడా వివరించనున్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ పార్టీలు నిర్వహించనున్న తొలి సభ కావడంతో దీనిని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు ఈ సభకు హాజరయ్యేలా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభ, కూటమి ప్రభుత్వ భవిష్యత్ కార్యాచరణను సూచించే ఒక ముఖ్యమైన వేదికగా నిలవనుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad