Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Dharmavaram: బీజేపీలోకి చేనేతల వలసలు

Dharmavaram: బీజేపీలోకి చేనేతల వలసలు

సత్య కుమార్ యాదవ్ కు పెరుగుతున్న మద్దతు

ధర్మవరం పట్టణంలో బీజేపీలోకి చేనేతల వలసల పరంపర కొనసాగుతోంది. వైసీపీకి చెందిన చేనేత వ్యాపారవేత్త గిర్రాజు నగేష్ ఆధ్వర్యంలో స్థానిక పుట్లమ్మ గుడి వద్ద బీజేపీలో చేరారు. ధర్మవరం నియోజకవర్గ ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ వీరికి కాషాయ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే సత్య కుమార్ మాట్లాడుతూ ఇక్కడ ఉన్నటువంటి చేనేత కార్మికులు, చేనేత వ్యాపారస్తులు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఆ సమస్యలన్నీ నేను తీరుస్తాను అని వారికి హామీ ఇచ్చారు.

- Advertisement -

ఈ సందర్భంగా చేనేత నాయకులు మాట్లాడుతూ ధర్మవరం నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఒక బీసీ నాయకునికి టికెట్ ఇవ్వడం సంతోషకరమని, అందులోనూ సత్యకుమార్ యాదవ్ లాంటి సమర్థవంతమైన నాయకుడు ధర్మవరంకు రావడం తమ అదృష్టమన్నారు. నియోజకవర్గంలోని బీసీలంతా ఏకమయ్యి సత్యకుమార్ యాదవ్ ను ఎమ్మెల్యేగా గెలిపించుకుందామని పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News