Sunday, November 16, 2025
Homeఆంధ్రప్రదేశ్Divvala Madhuri: జనసేన నేతలపై పోలీసులకు దివ్వెల మాధురి ఫిర్యాదు

Divvala Madhuri: జనసేన నేతలపై పోలీసులకు దివ్వెల మాధురి ఫిర్యాదు

వైసీపీ మద్దతుదారు, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ప్రియురాలు దివ్వెల మాధురి మరోసారి పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. సోషల్ మీడియాలో తనపై, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌(Duvvada Srinivas)పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న జనసేన పార్టీ నాయకులపై టెక్కలి సీఐ శ్రీనివాస్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.

- Advertisement -

ఈ సందర్భంగా మాధురి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆడవాళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ చెప్పారని.. ఇప్పుడు తన ఫిర్యాదుపై ఎలా స్పందిస్తారో చూస్తామని తెలిపారు. జనసేన నేతలు పెట్టిన అసభ్యకర పోస్టులు చూసి తాను మానసికంగా వేధన అనుభవించానని పేర్కొన్నారు. అలాగే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌పై కూడా సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. ఈ పోస్టులపై ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించలేదని మాధురి వాపోయారు. కాగా దువ్వాడ శ్రీనివాస్‌ను త్వరలోనే పెళ్లి చేసుకుంనని మాధురి తెలిపిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad