Thursday, February 6, 2025
Homeఆంధ్రప్రదేశ్Election Commission: ఏపీ ప్రభుత్వానికి ఎన్నికల సంఘం తీపి కబురు

Election Commission: ఏపీ ప్రభుత్వానికి ఎన్నికల సంఘం తీపి కబురు

ఏపీలో ఈనెల 27న ఎమ్మెల్సీ ఎన్నికలు(MLC Elections)జరగనున్న సంగతి తెలిసిందే. కృష్ణా-గుంటూరు, తూర్పుగోదావరి-పశ్చిమ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేషన్ స్థానాలకు… విజయనగరం-శ్రీకాకుళం-విశాఖపట్నం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. ఇటీవలే ఎన్నికల సంఘం షెడ్యూల్ కూడా విడుదలచేసింది. దీంతో ఆయా జిల్లాల పరిధిలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో రాజధాని అమరావతి(Amaravati) పనులకు ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారింది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘాని(Election Commission)కి సీఆర్డీఏ లేఖ రాసింది.

- Advertisement -

కేవలం గ్రాడ్యుయేట్ ఎన్నికలే కాబట్టి ఎన్నికల నియామవళి సడలించాలని సీఈసీని కోరింది. త్వరలోనే వరల్డ్ బ్యాంకు, ఏడీబీ రుణం మంజూరు కాబోతున్నాయని.. పనుల ప్రాధాన్యత దృష్ట్యా ఇబ్బంది లేకుండా చూడాలని విజ్ఞప్తి చేసింది. ఈ లేఖపై సీఈసీ స్పందిస్తూ అమరావతిలో పనులకు అభ్యంతరం లేదని స్పష్టం చేసింది. టెండర్లు పిలిచేందుకు, పనులు చేసుకునేందుకు అనుమతి ఇస్తూ సీఆర్టీఏ లేఖకు రిప్లై ఇచ్చింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News