Sunday, September 8, 2024
Homeఆంధ్రప్రదేశ్Emmiganur: నాటక రంగానికి మరణం లేదు: 'జబర్దస్త్' అప్పారావ్

Emmiganur: నాటక రంగానికి మరణం లేదు: ‘జబర్దస్త్’ అప్పారావ్

అమ్మ ఒడిలాంటి పౌరాణిక నాటక రంగానికి ఎప్పటికీ మరణం లేదని, జబర్దస్త్ కమెడియన్ అప్పారావు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అఖిల ప్రజాకళాకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకుల మహాలింగప్ప ఆహ్వానం మేరకు ఎమ్మిగనూరు పట్టణానికి వచ్చిన అప్పారావు..స్థానిక ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం ఎమ్మెల్యేను అప్పారావు శాలువా కప్పి సన్మానించారు. రామాంజనేయ యుద్ధంలోని రాముని పాత్రలోని పద్యాన్ని పాడి అక్కడి కళాకారులను మరింతగా ఉత్తేజపరిచారు. ఎమ్మిగనూరు ప్రాంతంలో కళాకారులను ఆదరిస్తున్న తీరు హర్షనీయమన్నారు. ప్రభుత్వం కూడా పేద కళాకారులను ఆదుకొని కళలను మరింతగా ఆదరించేలా చూడాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News