Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Emmiganuru: సిద్దంకు పోటీగా మేము సైతం సై

Emmiganuru: సిద్దంకు పోటీగా మేము సైతం సై

మాసమన్ దొడ్డిలో వైసీపీ ఫ్లెక్సీ Vs టిడిపి ఫ్లెక్సీ

2024 సాధారణ ఎన్నికల నేపథ్యంలో YCP ఏర్పాటు చేసిన సిద్దం ఫ్లెక్సీకు పోటీగా టిడిపి కూడా మేము సైతం సై అంటూ ఫ్లెక్సీను ఏర్పాటు చేశారు. ఎమ్మిగనూరు మండలం మాసుమాన్ దొడ్డి గ్రామంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి, YCP నేత ఎర్రకోట జగన్ మోహన్ రెడ్డి, YCP అభ్యర్థి బుట్టా రేణుక ఫోటోలు తో సిద్దం ఫ్లెక్సీను YCP నాయకులు ఏర్పాటు చేశారు. దీంతో టిడిపి నాయకులు హనుమంతరాయ చౌదరి, రంగన్న, అశోక్ చౌదరి, ముని స్వామి నాయుడు, వెంకటేష్ లు తగ్గేదేలే అంటూ మేము సైతం సై అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారా లోకేష్, మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి ఫోటోలు వేసి దుష్ట పాలన అంతమొందించడానికి మేము సైతం సై అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చర్చనీయంగా మారింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News