Sunday, July 7, 2024
Homeఆంధ్రప్రదేశ్BV Jayanageswar Reddy: జగన్ తీరుతో విసిగి టీడీపీలోకి గుమ్మనూరు

BV Jayanageswar Reddy: జగన్ తీరుతో విసిగి టీడీపీలోకి గుమ్మనూరు

టిడిపిలో చేరిన 300 మంది యువకులు

జగన్ మోహన్ రెడ్డి పాలనపై విసుగు చెందిన మంత్రి గుమ్మనూరు జయరామ్ తెలివి తెచ్చుకొని టిడిపిలో చేరారని టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి అన్నారు. స్థానిక బీవీ నివాసంలో అర్పీఎస్ఎఫ్, అర్యూఎస్ఎఫ్ నాయకులు షాహీద్ అఫ్రిది, రఘునాథ్ అధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి సమక్షంలో దాదాపు 300 మంది యువకులు టిడిపి లో చేరారు. వీరందరికీ టిడిపి కండువాలు వేసి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా బీవీజేఅర్ మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరిన యువతను విద్యార్థులను ఉద్యోగులను, రైతులను అణచివేసి అక్రమ కేసులు పెట్టారన్నారు. ఫ్యాన్ రెక్కలు విరగకొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇదే కసితో పని చేసి వైకాపా పాలనను సాగనంపాలని కోరారు. చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసుకుందాం, జనసేన, టిడిపి నాయకత్వంలో రాజ్యాధికారం రాబోతుందని అన్నారు.

- Advertisement -

అర్పీఎస్ఎఫ్ అద్యక్షుడు షాహీద్ అఫ్రిది , అర్యూఎస్ఎఫ్ అద్యక్షుడు రఘునాథ్ మాట్లాడుతూ చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడానికి తమ వంతు కృషి చేయడానికి టిడిపిలో చేరినట్లు తెలిపారు. టిడిపి బలోపేతానికి కృషి చేస్తామని అన్నారు.

కార్యక్రమంలో రహిమాన్, వీరేష్, వినయ్, నరసింహ, అజయ్, సత్య, నవీన్, సూర్య శ్రీపాద, వంశీతో టిడిపి మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి తురేగల్ నజీర్ అహ్మద్, అబ్దుల్లా పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News