Thursday, September 19, 2024
Homeఆంధ్రప్రదేశ్Emmiganuru: సిపిఎం పార్టీ మాజీ కౌన్సిలర్ సరోజమ్మ మృతి

Emmiganuru: సిపిఎం పార్టీ మాజీ కౌన్సిలర్ సరోజమ్మ మృతి

ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన సిపిఎం పార్టీ మాజీ కౌన్సిలర్ అడ్డాకుల సరోజమ్మ సోమవారం రాత్రి ఆకస్మికంగా మృతి చెందింది. సిపిఎం జిల్లా నాయకులు రామాంజనేయులు రాధాకృష్ణ గోవిందు, తాలూకా నాయకుల హనుమంతు రాముడు ఆమె భౌతిక దేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆమె మృతి సిపిఎం పార్టీకి తీరని లోటు అని అన్నారు. సిపిఎం పార్టీ ఎల్లవేళలా కుటుంబానికి అండదండలుగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు సిపిఎం నాయకులు అబ్దుల్, అంబేద్కర్, వీరేంద్ర, అజిత్, వెంకటేశుల శెట్టి, ప్రజాశక్తి సిబ్బంది రంగయ్య, దేవేంద్ర మూర్తి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News