Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్Emmiganuru: టీడీపీలోకి భారీగా వలసలు

Emmiganuru: టీడీపీలోకి భారీగా వలసలు

వైసీపీ వీడుతున్న...

ఎమ్మిగనూరు నియోజకవర్గం నందవరం మండలం నాగలదిన్నె గ్రామానికి చెందిన వైకాపా నాయకులు వడ్డే శ్రీనివాసులు, బలిజ శేఖర్, దాసరి నరసింహులు, వడ్డే భీమన్న, వడ్డే బాలరాజు, వడ్డే రంగస్వామి, వడ్డే యాల్లప్ప, వడ్డే వీరేష్ తో పాటు మరో 100 మంది టిడిపి లో చేరారు. స్థానిక బీవీ నివాసంలో టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి సమక్షంలో టిడిపి కండువాలు వేసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బీవీ మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు నచ్చక టిడిపిలో చేరారన్నారు. వచ్చే ఎన్నికల్లో తెదేపాను గెలిపించాలని కోరారు. అనంతరం పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ గత ఎన్నికలలో జగన్ మోహన్ రెడ్డిను గెలిపించడానికి ఎంతో కష్టపడ్డామని..మా కష్టాన్ని మరిచిన జగన్ తుగ్లక్ పాలన సాగిస్తున్నాడని ఆరోపించారు. టిడిపి ప్రవేశ పెట్టిన సూపర్ సిక్స్ పథకాలకు ఆకర్షితులై పార్టీ మారుతున్నట్టు వివరించారు.

- Advertisement -

కార్యక్రమంలో నాగలదిన్నె మాజీ సర్పంచ్ నాగేంద్రప్ప కుమారుడు ఈరన్న తో పాటు నందవరం మండలం టిడిపి నాయకులు మాధవ్ రావు దేశాయ్, గురురాజ్ రావు దేశాయ్, ఈరన్న గౌడ్, కాశీమ్ వలి, నారాయణ రెడ్డి, దర్మాపురం గోపాల్, రూపా జగదీష్, బోయ తిమ్మప్ప పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News