Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్Emmiganuru: 23వ రోజు రిలే దీక్షలు

Emmiganuru: 23వ రోజు రిలే దీక్షలు

బీవీ ఆధ్వర్యంలో దీక్షలు

స్కిల్ డెవలప్మెంట్ కేసులో జైలులో ఉన్న చంద్రబాబు నిర్దోషిగా బయటికి వస్తారని మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి అన్నారు. స్థానిక సోమప్ప సర్కిల్ లో 23 వ రోజు రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. ఎమ్మిగనూరులోని నందవరం మండలం హాలహార్వీ టిడిపి నాయకులు ఎన్ నారాయణ రెడ్డి, ఎం దావీదు, జీ గోపాల్, నాగరాజు, గోవిందు, దాస్, ప్రేమ్, మణీ, ముక్కరన్న, సుబ్బన్న, కిస్థఫర్, రవి, సురేష్, ఎర్రం నాయుడు, బాపురం వెంకట రాముడు, రామాంజనేయులు, జగ్గాపురం రంగన్న, గోపాల్, నరసింహులు, దర్మపురం స్వామి దీక్షలో కూర్చున్నారు. దీక్షలను మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొదట 324 కోట్లు అన్నారు. ఇప్పుడు 27 కోట్లు అంటున్నారు. రాజకీయ కక్షతో తప్పుడు కేసు పెట్టి జైల్ కు పంపారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు సుందర్ రాజు, కొండయ్య చౌదరి, మిఠాయి నరసింహులు, రామదాసు గౌడ్, గురురాజ్ రావు దేశాయ్ దయాసాగర్, కలిముల్లా, రామకృష్ణ నాయుడు, సోగనూరు డి దస్తగిరి, మల్లికార్జున,కటారి రాజేంద్ర, దమ నరసింహాలు, బోయ రంగన్న, దాదావలి, నజీర్ అహ్మద్, శిల్పి భాస్కర్, డీలర్ ఈరన్న, ఎరుకల పరమేష్, ఎరుకల శ్రీనివాసులు, వడ్డే కృష్ణ, మసీద్పురం రఘు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News