Thursday, September 19, 2024
Homeఆంధ్రప్రదేశ్Errakota Chennakesava Reddy: అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

Errakota Chennakesava Reddy: అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

గడప గడపకు మన ప్రభుత్వంలో..

కేంద్రమైన గోనెగండ్లలో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి ఆదేశాల మేరకు మండల కేంద్రమైన గోనెగండ్లలోనీ వీవర్స్ కాలనీలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రజా సంక్షేమ, అభివృద్ధే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారనీ నియోజకవర్గ సీనియర్ నాయకుడు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంగళవారం గోనెగండ్ల వీవర్స్ కాలనీలో ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం వారికి అందిస్తున్న పథకాలను, వాటి ద్వారా పొందిన లబ్ధిని వివరించారు. ప్రజా సమస్యలు తెలుసుకుని వేంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఎర్రకోట జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం జగనన్న సచివాలయం, వాలంటీర్ వ్యవస్థలను ప్రారంభించి ప్రజల గుమ్మం వద్దకే ప్రభుత్వ పథకాలను అందిస్తున్నారన్నారు. ఆ ప్రాంత వాసులు ఆయన దృష్టికి తీసుకురాగా ఆయా సమస్యలను పరిష్కరించాలని సంబందిత అధికారులకు సూచించారు. ప్రస్తుతం అన్ని గ్రామాల్లో ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి సహకారంతో అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మన్సూర్,మండల యూత్ ప్రెసిడెంట్ బందే నవాజ్, మండల జే సి ఎస్ కన్వీనర్ మనోహర్ రెడ్డి, మండల కన్వీనర్ దొరబాబు, చికెన్ రాజా,పద్మనాభం,సచివాలయ అధికారులు, కార్యకర్తలు, వాలెంటర్లు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News