Friday, May 30, 2025
Homeఆంధ్రప్రదేశ్Sanjay Kumar: ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్ సస్పెన్షన్ పొడిగింపు

Sanjay Kumar: ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్ సస్పెన్షన్ పొడిగింపు

ఏపీ సీఐడీ మాజీ చీఫ్‌ సంజయ్‌ కుమార్(Sanjay Kumar) సస్పెన్షన్‌ను మరోసారి పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అఖిల భారత సర్వీసు నిబంధనల ఉల్లంఘనపై క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఆయనను సస్పెండ్‌ చేసిన సంగతి తెలిసిందే. సంజయ్‌పై వచ్చిన అభియోగాల విచారణపై ఏర్పాటైన కమిటీ సిఫార్సులతో తొలుత 2024 డిసెంబరు 3న సస్పెండ్‌ చేసింది. అనంతరం సస్పెన్షన్‌ను 2025 మే 31 వరకు పొడిగించింది. తాజాగా ఆ సస్పెన్షన్‌ను ఈ ఏడాది నవంబర్‌ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

- Advertisement -

కాగా అప్పటి ప్రతిపక్షనేత, ప్రస్తుత సీఎం చంద్రబాబు స్కిల్ స్కాం కేసులో అరెస్ట్ అయిన సమయంలో ఐపీఎస్ అధికారి సంజయ్ కుమార్ సీఐడీ చీఫ్‌గా ఉన్న సంగతి తెలిసిందే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆయనకు పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టింది. అలాగే ఆయనపై అవినీతి ఆరోపణలు రావడంతో విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. విజిలెన్స్ విచారణలో అవినీతికి పాల్పడినట్లు తేలడంతో సస్పెండ్ చేసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News