Sunday, July 7, 2024
Homeఆంధ్రప్రదేశ్గాజులదిన్నె ప్రాజెక్టు పరిశీలించిన కోట్ల

గాజులదిన్నె ప్రాజెక్టు పరిశీలించిన కోట్ల

జీడీపీ అధికారులపై ఆగ్రహం

గోనెగండ్ల మండల పరిధిలోని గాజులదిన్నె ప్రాజెక్టును టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు, మాజీ కేంద్రమంత్రి వర్యులు కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గాజుల దిన్నె ప్రాజెక్టు నిర్మాణం పనులకు రాష్ట్ర ప్రభుత్వం 50 కోట్లు నిధులు మంజూరు చేశారనీ ఈ పనులు నాశిరకంగా చేస్తున్నారని వాపోయారు.

- Advertisement -

గాజులదిన్నె ప్రాజెక్టులో నీటి నిల్వ దాదాపు 2 టీఎంసీలు ఉన్నట్లు అధికారులతో మాట్లాడి తెలుసుకున్నారు. ప్రాజెక్టు పనులు జరుగుతుండటంతో ప్రాజెక్టులో ఉన్న నీరు హంద్రీలోకి వదలడంతో అధికారులపై కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా గాజులదిన్నె ప్రాజెక్ట్ ఆధికారులు మాట్లాడుతూ వారం రోజుల్లో గేట్ల పనులు పూర్తి చేస్తామని, వర్షపు నీటిని నిల్వ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పరమేశ్వర రెడ్డి,
మధుసూదన్ రెడ్డి, కేఇ రాంబాబు గౌడ్, సీబి లత, సర్పంచ్ భాగ్య రత్న, సర్పంచ్ అలువాల భాషా, ఎన్ వి బాబు నాయుడు, దరగల మాబు, కౌలుట్లయ్య నాయుడు, చెన్నల రాయుడు, రంగూన్ భాషా, గంజిహళ్లి పెద్ద లక్షన్న, యూనుస్, గంజిహళ్లి సుధాకర్, అక్బర్, అలువాల లక్షన్న, బోడెన్న పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News