Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Gangula: ఏ సమస్యలున్నా నా దృష్టికి తెండి

Gangula: ఏ సమస్యలున్నా నా దృష్టికి తెండి

ఆళ్లగడ్డలోని ఏ కాలనీలో ఏ సమస్యలు ఉన్నా తన దృష్టికి తేవాలని ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి కోరారు. దోర్నిపాడు మండల కేంద్రం ఎస్సీ కాలనీలో నాలగవరోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో శాసన సభ్యులు గంగుల బ్రిజేంద్రా రెడ్డి పాల్గొన్నారు. ఎస్సీ కాలనీలో కలయదిరిగారు. ప్రతి కుటుంబాన్ని పలకరిస్తూ సంక్షేమ పథకాలు అందేయా లేదా అని అడిగి తెలుసుకుని సంక్షేమ పథకాలు వివరిస్తూ ఇంకా అర్హులైన వారు సంక్షేమ అందరివారు ఎవరైనా ఉంటే వెంటనే తెలపాలని ఎమ్మెల్యే గంగుల కోరారు. పర్యటనలో ఎమ్మెల్యే దృష్టికి వచ్చిన సమస్యలు త్రాగునీరు, ఇంటి స్థలాలు, డ్రైనేజ్, సాంకేతిక సమస్యల కారణంగా నిలిచిపోయిన పెన్షన్లు మొదలగు ప్రతీ చిన్న సమస్యను కూడా పరిష్కరించ వలసిందిగా అధికారులను ఆయన ఆదేశించారు..అధికారులు ఆలస్యం వహిస్తే ఆళ్లగడ్డలోని తన కార్యాలయానికి రావాలని ఎమ్మెల్యే గంగుల కాలనీ ప్రజలకు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ భూమా చెంచి రెడ్డి , ఎంపీపీ అమర్నాథ్ రెడ్డి , జెడ్పీటీసీ పయిడేల శకుంతమ్మ ఎస్సై తిరుపాల్,స్టేట్ యాదవ సంఘం డైరెక్టర్ బత్తుల నాగేశ్వరరావు,వైస్ ఎంపీపీ లక్ష్మి రెడ్డి ,సర్పంచ్ శానికాదేవి గారు,అమ్మిరెడ్డి నగరం సర్పంచ్ లక్కు చంద్రశేఖర్ రెడ్డి , కాకనూరు మనోహర్ రెడ్డి, బాచిరెడ్డి లక్ష్మి కాంత రెడ్డి, ఎండోమెంట్ కోలకట్టు రామకృష్ణా, గోపినేని నాగరాజు, జీ.తిరుపతయ్య చలం నడిపెన్న బత్తుల కృష్ణయ్య యాదవ్,మాధవ స్వామి ఆలయ చైర్మన్ పగడాల శ్రీనివాసులు పగిడెల శీవనాగిరెడ్డి (డీలర్) ఏ.గోపాల్ యాదవ్ ,చాకరాజ వేముల వైఎస్సార్సీపీ నాయకులు మనోహర్ నాయుడు దోర్నిపాడు మాజీ సర్పంచ్ పాదం శ్రీనివాసులు ,వైఎస్సార్సీపీ నాయకులు రాంబాబు ..పలువురు వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు గంగుల కుటుంబ అభిమానులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News