Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Gangula: పేదోళ్ల కళ్ళలో ఆనందం చూడాలనేదే ముఖ్యమంత్రి ఆశయం

Gangula: పేదోళ్ల కళ్ళలో ఆనందం చూడాలనేదే ముఖ్యమంత్రి ఆశయం

అభివృద్ధిలో ఎక్కడా రాజీ పడే ప్రసక్తి లేదు

రాష్ట్ర సంక్షేమం పేదల అభ్యున్నతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశయమని ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి అన్నారు. ఆళ్లగడ్డ పట్టణంలోని3వ సచివాలయ పరిధిలోని పడకండ్లలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే గంగుల నాని నంద్యాల జిల్లా వైసీపీ ఉపాధ్యక్షులు బసాపురం సలాంతో కలిసి పాల్గొన్నారు. అక్కడికి చేరుకున్న ఆయనకు వైసీపీ నాయకులు బద్రి సుధాకర్ రెడ్డి బద్రి భాస్కర్ రెడ్డి బద్రి నీలకంఠేశ్వర్ రెడ్డి ఇతర వైకాపా నాయకులు పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఇంటింటికి వెళ్ళి జగనన్న ప్రభుత్వం అందించే సంక్షేమాన్ని వివరిస్తూ.. మరోవైపున స్థానికంగా ప్రజలు చెబుతున్న సమస్యలను ఓపికగా వింటూ, అక్కడిక్కడే పరిష్కార మార్గం చూపడానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఎమ్మెల్యే గంగుల నాని మాట్లాడుతూ పట్టణాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేస్తున్నామని అభివృద్ధిలో ఎక్కడ కూడా రాజీ పడే ప్రసక్తి లేదన్నారు. సంక్షేమ పథకాలు 98 శాతం అర్హులైన అందరికీ అందాయన్నారు. ఇంకా అర్హులై ఉండి, సంక్షేమ పథకాలు అందని వారు ఉంటే సచివాలయంలో అధికారులను కలవాలన్నారు.

- Advertisement -

ప్రజల కోసం కష్టపడే ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరిస్తారని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిత్యం ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూ సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్నారని అందుకే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని ఇతర ప్రతిపక్ష పార్టీలో ఎన్ని మాటలు చెప్పినా వారి మాటలు ప్రజలు నమ్మే స్థితిలో లేరని నాడు పరిపాలన చేయలేక చేతులెత్తేసిన వారు నేడు అవకాశం ఇవ్వండి మేము చేస్తాం అనడం విడ్డూరంగా ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో మీ అందరి చల్లని దీవెనలు ఆశీస్సులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మెండుగా అంది ఇవ్వాలని ఎమ్మెల్యే గంగుల కోరారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఏవి రమేష్ బాబు, మున్సిపల్ కౌన్సిలర్ గొట్లూరు సుధాకర్ రెడ్డి ఏఈ సురేంద్ర రెడ్డి సింగం వెంకటేశ్వర్ రెడ్డి ఎస్సై వెంకట్ రెడ్డి ,కోటకందుకూరు వైఎస్సార్సీపీ నాయకులు రాజగోపాల్ రెడ్డి బాలస్వామి అన్ని శాఖల అధికారులు సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News