Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Gangula: వివోఏ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తా

Gangula: వివోఏ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తా

వినతి పత్రం సమర్పించిన..

వైయస్సార్ క్రాంతి పదం వివోఏ యూనియన్ ఆధ్వర్యంలో వివోఏల సమస్యలపై ఆళ్లగడ్డ శాసనసభ్యులు గంగుల బిజేంద్ర రెడ్డిని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. పట్టణంలోని ఎమ్మెల్యే గంగుల కార్యాలయంలో వివోఏ యూనియన్ జిల్లా నాయకులు ఎంవి నరసింహులు తదితరులు ఎమ్మెల్యే గంగులకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు నరసింహులు మాట్లాడుతూ..వివోఏలకు ఉద్యోగ భద్రత కల్పించాలని, వివో గౌరవేతనాన్ని 26 వేలకు పెంచాలని,10 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని వివోఏలు పలు రకాల పనులను మొబైల్ లోనే చేస్తున్నందున 5G మొబైల్ ఫోన్స్ సౌకర్యం కల్పించాలని, వివోఏల గౌరవేతనం వివో ఏల అకౌంట్ లోనే జమ చేయాలని డిమాండ్ల తెలిపారు. ఈ సందర్భంగా ఈ డిమాండ్లపై ఎమ్మెల్యే గంగుల స్పందిస్తూ వివో సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు రత్నం, మధు పుల్లన్న బలరాం రాజబాబు సుభాష్ విజయ రాణి మరియమ్మ రుద్రవరం, ఆళ్లగడ్డ చాగలమర్రి సిరివెళ్ల దొర్నిపాడు ఉయ్యల వాడ మండలాలకు చెందిన మండల సాయి నాయకులు వివో ఏలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News